Skip to main content

నెట్ లో వెతికితే మీ వివరాలు వస్తాయి


వర్చువల్ విజిటింగ్ కార్డులను ప్రవేశపెట్టనున్న గూగుల్

గూగుల్ ఒక సరికొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. ప్రతి ఒక్కరి సమాచారం తన సెర్చింజన్ లో దొరికేలా వర్చువల్ విజిటింగ్ కార్డులను ప్రవేశపెట్టనుంది . వీఐపీలు, ఎంట ర్ ప్రిన్యూ ర్ల మొదలుకొని సాధారణ జనం వరకు అంతా ఈ ఫీచర్ ను వాడుకోవచ్చు. ఈ వర్చువల్ విజిటింగ్ కార్డ్ లను ‘పీపుల్ కార్డ్స్ ’గా పిలుస్తారు . ఉదాహరణకు శ్రీనివాస్ అనే వ్యక్తి గూగుల్ ద్వారా వర్చువల్ విజిటింగ్ కార్డ్ తయారు చేసుకుంటే.. ఆయన పేరు ను గూగుల్ లో వెతికితే వివరాలన్నీ వస్తాయి. అంటే సాధారణ విజిటింగ్ కార్డ్ లోఉండే సమాచారం ఆన్ లైన్ లో కనిపిస్తుంది. నెట్లో​ తన వివరాలు ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చని గూగుల్ బ్లాగ్ పోస్ట్​ తెలియజేసింది.

ఎలా తయారు చేసుకోవాలంటే..

మొదట గూగుల్ పేజీని ఓపెన్ చేసి మన వివరాలతో సైన్ ఇన్ కావాలి. తరువాత ‘యాడ్ టు మీ టూ సెర్చ్​’ అని టైప్​ చేస్తే, వివరాలు నింపాల్సిందిగా సూచిస్తూ ఒక పేజీ వస్తుంది. ఆ పని పూర్తి చేస్తే పీపుల్ కార్డు తయారవుతుంది. దీనికి ఫొటోలను, సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్లనూ జతచేసుకోవచ్చు. వెరిఫికేషన్ కోసం ఫోన్ నంబరు, ఈ–మెయిల్ అడ్రస్ ఇవ్వాలి. వివరాలు పబ్లిక్ కు అందుబాటులో ఉంచుకోవాలా లేదా అన్నది కూడా మన ఇష్టమే! ఒక గూగుల్ అకౌంట్ పై ఒకే కార్డును తయారు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ప్రతి ఎకౌంట్ కూ వేర్వేరు ఫోన్ నంబర్లు ఇవ్వాలి.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.