Skip to main content

నెట్ లో వెతికితే మీ వివరాలు వస్తాయి


వర్చువల్ విజిటింగ్ కార్డులను ప్రవేశపెట్టనున్న గూగుల్

గూగుల్ ఒక సరికొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. ప్రతి ఒక్కరి సమాచారం తన సెర్చింజన్ లో దొరికేలా వర్చువల్ విజిటింగ్ కార్డులను ప్రవేశపెట్టనుంది . వీఐపీలు, ఎంట ర్ ప్రిన్యూ ర్ల మొదలుకొని సాధారణ జనం వరకు అంతా ఈ ఫీచర్ ను వాడుకోవచ్చు. ఈ వర్చువల్ విజిటింగ్ కార్డ్ లను ‘పీపుల్ కార్డ్స్ ’గా పిలుస్తారు . ఉదాహరణకు శ్రీనివాస్ అనే వ్యక్తి గూగుల్ ద్వారా వర్చువల్ విజిటింగ్ కార్డ్ తయారు చేసుకుంటే.. ఆయన పేరు ను గూగుల్ లో వెతికితే వివరాలన్నీ వస్తాయి. అంటే సాధారణ విజిటింగ్ కార్డ్ లోఉండే సమాచారం ఆన్ లైన్ లో కనిపిస్తుంది. నెట్లో​ తన వివరాలు ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చని గూగుల్ బ్లాగ్ పోస్ట్​ తెలియజేసింది.

ఎలా తయారు చేసుకోవాలంటే..

మొదట గూగుల్ పేజీని ఓపెన్ చేసి మన వివరాలతో సైన్ ఇన్ కావాలి. తరువాత ‘యాడ్ టు మీ టూ సెర్చ్​’ అని టైప్​ చేస్తే, వివరాలు నింపాల్సిందిగా సూచిస్తూ ఒక పేజీ వస్తుంది. ఆ పని పూర్తి చేస్తే పీపుల్ కార్డు తయారవుతుంది. దీనికి ఫొటోలను, సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్లనూ జతచేసుకోవచ్చు. వెరిఫికేషన్ కోసం ఫోన్ నంబరు, ఈ–మెయిల్ అడ్రస్ ఇవ్వాలి. వివరాలు పబ్లిక్ కు అందుబాటులో ఉంచుకోవాలా లేదా అన్నది కూడా మన ఇష్టమే! ఒక గూగుల్ అకౌంట్ పై ఒకే కార్డును తయారు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ప్రతి ఎకౌంట్ కూ వేర్వేరు ఫోన్ నంబర్లు ఇవ్వాలి.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...