Skip to main content

నెట్ లో వెతికితే మీ వివరాలు వస్తాయి


వర్చువల్ విజిటింగ్ కార్డులను ప్రవేశపెట్టనున్న గూగుల్

గూగుల్ ఒక సరికొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. ప్రతి ఒక్కరి సమాచారం తన సెర్చింజన్ లో దొరికేలా వర్చువల్ విజిటింగ్ కార్డులను ప్రవేశపెట్టనుంది . వీఐపీలు, ఎంట ర్ ప్రిన్యూ ర్ల మొదలుకొని సాధారణ జనం వరకు అంతా ఈ ఫీచర్ ను వాడుకోవచ్చు. ఈ వర్చువల్ విజిటింగ్ కార్డ్ లను ‘పీపుల్ కార్డ్స్ ’గా పిలుస్తారు . ఉదాహరణకు శ్రీనివాస్ అనే వ్యక్తి గూగుల్ ద్వారా వర్చువల్ విజిటింగ్ కార్డ్ తయారు చేసుకుంటే.. ఆయన పేరు ను గూగుల్ లో వెతికితే వివరాలన్నీ వస్తాయి. అంటే సాధారణ విజిటింగ్ కార్డ్ లోఉండే సమాచారం ఆన్ లైన్ లో కనిపిస్తుంది. నెట్లో​ తన వివరాలు ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చని గూగుల్ బ్లాగ్ పోస్ట్​ తెలియజేసింది.

ఎలా తయారు చేసుకోవాలంటే..

మొదట గూగుల్ పేజీని ఓపెన్ చేసి మన వివరాలతో సైన్ ఇన్ కావాలి. తరువాత ‘యాడ్ టు మీ టూ సెర్చ్​’ అని టైప్​ చేస్తే, వివరాలు నింపాల్సిందిగా సూచిస్తూ ఒక పేజీ వస్తుంది. ఆ పని పూర్తి చేస్తే పీపుల్ కార్డు తయారవుతుంది. దీనికి ఫొటోలను, సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్లనూ జతచేసుకోవచ్చు. వెరిఫికేషన్ కోసం ఫోన్ నంబరు, ఈ–మెయిల్ అడ్రస్ ఇవ్వాలి. వివరాలు పబ్లిక్ కు అందుబాటులో ఉంచుకోవాలా లేదా అన్నది కూడా మన ఇష్టమే! ఒక గూగుల్ అకౌంట్ పై ఒకే కార్డును తయారు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ప్రతి ఎకౌంట్ కూ వేర్వేరు ఫోన్ నంబర్లు ఇవ్వాలి.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...