Skip to main content

గులాం నబీ అజాద్ ను సముదాయించిన సోనియాగాంధీ?

 సీడబ్ల్యూసీ సమావేశంలో కొందరు సీనియర్ నేతలపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరైన గులాం నబీ అజాద్ తీవ్రంగా నొచ్చుకున్నారు. పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా ఆయన సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.


ఈ నేపథ్యంలో అజాద్ ను శాంతింపజేసే పనుల్లో హైకమాండ్ నిమగ్నమైంది. అజాద్ కు సాక్షాత్తు సోనియాగాంధీనే ఫోన్ చేసినట్టు సమాచారం. రాహుల్ వ్యాఖ్యలకు నొచ్చుకోవద్దని ఈ సందర్భంగా సోనియా కోరినట్టు తెలుస్తోంది. అసమ్మతివాదుల డిమాండ్లను వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు సమాచారం.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.