Skip to main content

అమరావతి నిర్మాణం ఎక్కడ ఆగిపోయిందో ఆ వివరాలు కావాలన్న హైకోర్టు

 


అమరావతి అంశంలో దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. రాజధాని నిధుల వ్యయంపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరుపుతూ హైకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకు రూ.52 వేల కోట్లు ఖర్చు చేశారని న్యాయవాది మురళీధర్ సీఆర్డీఏ రికార్డులను కోర్టుకు సమర్పించారు. 


ఈ సందర్భంగా, రూ.52 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి? అంటూ కోర్టు ప్రశ్నించింది. దానికి సంబంధించిన సమగ్ర వివరాలు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ కు నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. రాజధాని అమరావతి నిర్మాణం ఎక్కడ ఆగిపోయిందో ఆ వివరాలు కూడా అందించాలని కోరింది.

ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  అమరావతిలో వెచ్చించిన సొమ్ము ప్రజల సొమ్ము అని, వృథా అయితే రాష్ట్ర ఖజానాకు నష్టం వస్తుందని పేర్కొంది. నిర్మాణం పూర్తిచేసుకున్న భవనాలను ఎవరూ వాడకుంటే అవి పాడైపోతాయని, ఆ నష్టం ఎవరు భరించాలని ప్రశ్నించింది. అనంతరం ఈ పిటిషన్లపై తదుపరి విచారణ ఈ నెల 14న ఉంటుందని వెల్లడించింది.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.