Skip to main content

ప్రజారాజ్యంలో బావరాజ్యం' వార్తలపై ఆర్జీవీ కామెంట్...!

 


వివాదస్పసద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 'క్లైమాక్స్' 'నగ్నం' 'పవర్ స్టార్' అనే సినిమాలను ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజ్ చేసిన వర్మ ''మర్డర్'' ''థ్రిల్లర్'' అనే మరో రెండు సినిమాలను విడుదలకు సిద్ధం చేసారు. ఫిక్షనల్ రియాలిటీ జోనర్ లో ''ఆర్జీవీ మిస్సింగ్'' అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు రామ్ గోపాల్ వర్మ. ఈ చిత్రంలో ప్రవన్ కళ్యాణ్ - ఒమేగా స్టార్ - సీబెఎన్ - లాకేష్ - వై ఎస్ జగన్ - KCAR - KTARలు ప్రధాన పాత్రల్లో నటించనున్నారని చెప్పుకొచ్చారు. వర్మ చెప్పకపోయినా అవన్నీ నిజజీవితంలో పాత్రలను పోలి ఉన్నవని అందరికి తెలుసు. దీంతోపాటు అల్లు అరవింద్ పై సెటైరికల్ గా ''ప్రజారాజ్యంలో బావరాజ్యం'' అనే సినిమా తీయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆర్జీవీ ఈ వార్తలపై స్పందించారు.

ఆర్జీవీ మాట్లాడుతూ.. ''గత 20 ఏళ్లుగా నాకు నచ్చిన విధంగా నేను సినిమాలు తీసుకొంటూ వస్తున్నాను. మీకు నచ్చితే చూడండి లేకపోతే చూడొద్దు. నాపై కామెంట్లు చేస్తే పట్టించుకోవడానికి నాకు అంత సమయం లేదు. నేను బూతు సినిమాలు తీస్తున్నారంటే ఒప్పుకోను. 'పవర్ స్టార్' 'కరోనా' 'అమృత' సెక్స్ సినిమాలా? అందులో సెక్స్ ఉందా?. ఇతర కథలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో శృంగారానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తాను. కొందరికి హిపోక్రసీ. శృంగారాన్ని సపరేట్ అంశంగా చేసి దానిని ప్రత్యేకంగా చూస్తారు. నాకు అలా చూడటం ఇష్టం ఉండదు. అన్ని ఎమోషన్స్ మాదిరిగానే దానిని కూడా చూస్తాను'' అని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా చిరంజీవి - అల్లు అరవింద్ ను టార్గెట్ చేస్తూ సినిమా తీస్తున్నారనే వార్తలపై నేను స్పందించను. నేను ఏ సినిమా తీయాలి.. దానిని ఎప్పుడు అనౌన్స్ చేయాలి అనేది నా ఇష్టం. నా సినిమాల గురించి ఎప్పుడు ఎలా చెప్పాలో నాకు సంబంధించిన అంశం. 'ప్రజారాజ్యంలో బావరాజ్యం' అనే సినిమా తీస్తున్నానని వచ్చే వార్తలపై వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదని రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...