జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో బుధవారం తెల్లవారు జామున ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కంరాజీపొరా ప్రాంతంలో జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ చేపడుతుండగా.. ఉగ్రవాదులు వారిపై కాల్పులకు దిగారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ వీరమరణం పొందారు. మరో జవాన్ గాయాలపాలయ్యారు. దీంతో వెంటనే గాయపడ్డ జవాన్ను స్థానిక ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. కంరాజీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ కట్టుదిట్టంగా చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు. మిగతా ఉగ్రవాదుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది.
తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది. 2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు. అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు. ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...
Comments
Post a Comment