Skip to main content

బాలు సర్ విషమ పరిస్థితిని అధిగమించారు: రజనీకాంత్

 అన్ని ప్రధాన భాషల్లోనూ పాటలు పాడి దశాబ్దాలుగా సంగీత ప్రియుల్ని అలరిస్తున్న గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో కొన్నిరోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. విషమ పరిస్థితిలో ఉన్న ఆయన క్షేమంగా తిరిగిరావాలంటూ శ్రేయోభిలాషులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వీడియో సందేశం రిలీజ్ చేశారు. 'ప్రియమైన బాలు సర్, మీరు త్వరగా కోలుకోవాలి' అంటూ ఆకాంక్షించారు.


"ఐదు దశాబ్దాలకు పైగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అనే భాషల్లో పాటలు పాడారు. తన మధురమైన కంఠస్వరంతో కోట్లాదిమందిని అలరించారు. ఇప్పుడాయన కరోనా వైరస్ కలిగించిన విషమ పరిస్థితిని అధిగమించారని తెలిసింది. ఈ వార్త వినగానే నాకు ఎంతో సంతోషం కలిగింది. ఇంకా ఐసీయూలోనే ఉన్న ఆయన త్వరగా కోలుకోవాలంటూ సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడ్ని ప్రార్థించాను" అంటూ తన వీడియోలో పేర్కొన్నారు.  

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...