Skip to main content

విశాఖ రాజధాని శంకుస్థాపనకు మోదీ వస్తారా? రారా..?? |


రాకపోతే ఒక తంటా!.. వస్తే మరో తంటా ! ఇది మోడీ పరిస్థితి !!

ఆగస్టు 15న అధికారికంగా విశాఖ రాజధాని కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. నిర్మాణాలు, పూర్తిస్థాయి కట్టడాలు ప్రస్తుతానికి ఏమీ ఉండవు గాని పరిపాలన భవనం, సీఎం క్యాంప్ ఆఫీస్, అధికారుల భవనాలుగా మాత్రం కొన్ని ప్రైవేటు భవనాలను వాడుతుంటారు. మరి వీటి ప్రారంభోత్సవానికి, శంకుస్థాపన కు మోదీని ఆహ్వానిస్తారు. సరిగ్గా ఐదేళ్ల క్రిందట 2015 అక్టోబర్ లో అమరావతి రాజధాని శంకుస్థాపన కు ప్రధాని మోదీ వచ్చారు. గంగా నది నుండి నీటిని, పార్లమెంట్ భవనం నుండి మట్టి తీసుకువచ్చారు. కానీ రాజధానికి పెద్దగా నిధులు ఇచ్చింది, కల్పించిన ప్రయోజనం ఏమి లేదు.

ఇప్పుడు విశాఖ కు వస్తారా రారా అంటే వైసీపీ కూడా ఖచ్చితంగా చెప్పలేక పోతుంది. బీజేపీ వర్గాలు మాత్రం రాకపోవచ్చనే అంటున్నారు. దానికి కారణం ఆ రోజు ఆగస్టు 15 కావడం, ఢిల్లీలో స్వతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొనాల్సి ఉండటం, అమరావతిని స్వయంగా ప్రధాని మోదీ తన చేతులతో శంకుస్థాపన చేయడం, మళ్లీ ఇప్పుడు విశాఖ వస్తే అమరావతి పరిస్థితి ఏమిటి, మీరే శంకుస్థాపన చేశారు కదా? అనే ప్రశ్నలకు బిజెపి సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. ఈ గొడవంతా ఎందుకులే అనుకొని మోదీ రాకపోవచ్చని బిజెపి వర్గాలు అంటున్నాయి. కానీ వైసిపి మాత్రం తమ ప్రణాళికలు పని చేసి పూర్తిస్థాయి లాబీయింగ్ చేసి మోదీ ని కనుక రప్పించగల్గితే కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు జగన్ పైన, వైసీపీ పైన పూర్తి స్థాయిలో ఉన్నాయని రాష్ట్రంలో ప్రతి సగటు మనిషికి అర్థం అవుతుంది. అందుకే మోదీ ని రప్పించేందుకు వైసీపీ ప్రయత్నం వైసీపీ చేస్తుండగా, రాకుండా ఉండేందుకు బిజెపి సాకులు వెతుకుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో!.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...