Skip to main content

విశాఖ రాజధాని శంకుస్థాపనకు మోదీ వస్తారా? రారా..?? |


రాకపోతే ఒక తంటా!.. వస్తే మరో తంటా ! ఇది మోడీ పరిస్థితి !!

ఆగస్టు 15న అధికారికంగా విశాఖ రాజధాని కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. నిర్మాణాలు, పూర్తిస్థాయి కట్టడాలు ప్రస్తుతానికి ఏమీ ఉండవు గాని పరిపాలన భవనం, సీఎం క్యాంప్ ఆఫీస్, అధికారుల భవనాలుగా మాత్రం కొన్ని ప్రైవేటు భవనాలను వాడుతుంటారు. మరి వీటి ప్రారంభోత్సవానికి, శంకుస్థాపన కు మోదీని ఆహ్వానిస్తారు. సరిగ్గా ఐదేళ్ల క్రిందట 2015 అక్టోబర్ లో అమరావతి రాజధాని శంకుస్థాపన కు ప్రధాని మోదీ వచ్చారు. గంగా నది నుండి నీటిని, పార్లమెంట్ భవనం నుండి మట్టి తీసుకువచ్చారు. కానీ రాజధానికి పెద్దగా నిధులు ఇచ్చింది, కల్పించిన ప్రయోజనం ఏమి లేదు.

ఇప్పుడు విశాఖ కు వస్తారా రారా అంటే వైసీపీ కూడా ఖచ్చితంగా చెప్పలేక పోతుంది. బీజేపీ వర్గాలు మాత్రం రాకపోవచ్చనే అంటున్నారు. దానికి కారణం ఆ రోజు ఆగస్టు 15 కావడం, ఢిల్లీలో స్వతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొనాల్సి ఉండటం, అమరావతిని స్వయంగా ప్రధాని మోదీ తన చేతులతో శంకుస్థాపన చేయడం, మళ్లీ ఇప్పుడు విశాఖ వస్తే అమరావతి పరిస్థితి ఏమిటి, మీరే శంకుస్థాపన చేశారు కదా? అనే ప్రశ్నలకు బిజెపి సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. ఈ గొడవంతా ఎందుకులే అనుకొని మోదీ రాకపోవచ్చని బిజెపి వర్గాలు అంటున్నాయి. కానీ వైసిపి మాత్రం తమ ప్రణాళికలు పని చేసి పూర్తిస్థాయి లాబీయింగ్ చేసి మోదీ ని కనుక రప్పించగల్గితే కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు జగన్ పైన, వైసీపీ పైన పూర్తి స్థాయిలో ఉన్నాయని రాష్ట్రంలో ప్రతి సగటు మనిషికి అర్థం అవుతుంది. అందుకే మోదీ ని రప్పించేందుకు వైసీపీ ప్రయత్నం వైసీపీ చేస్తుండగా, రాకుండా ఉండేందుకు బిజెపి సాకులు వెతుకుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో!.

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.