ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రముఖ సింగర్ ఆసుపత్రి పాలైంది అయ్యింది.ఇండియన్ ఐడల్ తో సింగర్ రేణు నగర్ పాపులర్ అయ్యింది. దేశంలో మంచి సింగర్ గా ఆమెకు మంచి పేరుంది . అయితే తన ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో రేణు ఆరోగ్యం క్షీణించింది. ఆమెను జైపూర్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.అసలు విషయం ఏంటంటే .. సింగర్ రేణు నగర్ పెళ్ళైన రవిశంకర్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఇద్దరు ఇంటినుంచి పారిపోయారు. కూతురు కనిపించకపోవడంతో రేణు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు . పోలీసులు ఆగష్టు 24న వీరి జాడను కనిపెట్టి తిరిగి తీసుకువచ్చారు. ఈక్రమంలో బుధవారం రవిశంకర్ విషంతాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెల్సుకున్న రేణు సృహతప్పిపడిపోయింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, ఐసీయూలో చిక్సిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

Comments
Post a Comment