Skip to main content

లెబనాన్ రాజధానిలో భారీ పేలుళ్లు.. భయానక దృశ్యాలు


వీడియో చూడండి:https://youtu.be/FSpm4PU8NVk

లెబనాన్ రాజధాని బీరుట్ భారీ పేలుళ్లతో వణికిపోయింది. పేలుడు ధాటికి ఇళ్లలో కిటికీల అద్దాలు పగిలిపోయాయి. బాల్కనీలు కుప్పకూలాయి. జనం భయంతో పరుగులు తీశారు.వందలాది మంది గాయపడినట్లు తెలుస్తోంది. 10 మంది మరణించినట్లు కొంత మంది మీడియా ప్రతినిధులు ట్విటర్ ద్వారా తెలిపారు. భారీ ప్రాణ నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పేలుళ్లతో జనం వణికిపోయారు. వీధుల వెంట పరుగులు తీశారు. మొదటి పేలుడు సంభవించిన కాసేపటికే రెండో పేలుడు సంభవించినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా వెబ్‌సైట్లలో రాశారు.B

 
పేలుడు ధాటికి ఇళ్లలో కిటికీల అద్దాలు పగిలిపోయాయి. పలు ఇళ్లలో బాల్కనీలు కుప్పకూలాయి. ఒక్కసారిగా భూమి కంపించినంత పని అయిందని సోషల్ మీడియాలో కొంత మంది కామెంట్లు పెట్టారు. పేలుడు అనంతరం దట్టమైన పొగ కమ్ముకుంది. కొన్ని వీడియోల్లో జనం ఆర్తనాదాలు చేయడం వినిపిస్తోంది.

లెబనాన్‌ పేలుళ్లకు సంబంధించిన ఫోటోలు ట్విటర్‌లో వైరల్ అవుతున్నాయి. లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్‌లోని పోర్ట్ ఏరియాలో మంగళవారం (ఆగస్టు 4) సాయంత్రం ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగా భారీ పేలుడు సంభవించిందని కొన్ని మీడియా కథానాల్లో పేర్కొన్నారు. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...