Skip to main content

ఫ్లిప్‌ కార్ట్‌ నుంచి ఆల్కహాల్‌ డెలివరీ

 

ఆల్కహాల్‌ ను హోం డెలివరీ చేయడానికి ఫ్లిప్‌ కార్ట్‌‌‌‌ రెడీ అవుతోంది. ఇందుకోసం ఇండియన్‌ ఆల్కహాల్‌ హోం డెలివరీ యాప్‌ హిప్‌ బార్‌ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఆల్కహాల్‌ బెవరేజెస్‌ ను తయారు చేసే డియోజియో హిప్‌ బార్‌ లో 26 శాతం వాటా ఉంది. హిప్‌ బార్‌ కు టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌ గా ఫ్లిప్‌ కార్ట్‌‌‌‌ పనిచేయడానికి పశ్చిమ బెంగాల్‌ , ఒడిశా ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయని నేషనల్‌ మీడియా పేర్కొంది. ఈ భాగస్వామ్యం వల్ల ఫ్లిప్‌ కార్ట్‌‌‌‌ యూజర్లు హిప్‌ బార్‌ యాప్‌ ను యాక్సె స్‌ చేసుకోవచ్చు. కస్టమర్లు తమకు కావాల్సి న ఆల్కహాల్‌ ను ఆర్డర్‌ పెట్ టు కుంటే హిప్‌ బార్‌ హోం డెలివరీ చేస్తుందని సంబంధిత వ్యక్తులు చెప్పారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...