Skip to main content

మరో సినీ ద‌ర్శ‌కుడికి క‌రోనా పాజిటివ్ నిర్ధారణ

 


ఆర్ఎక్స్ -100 సినిమా దర్శకుడు అజ‌య్ భూప‌తికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. 'త్వ‌ర‌లో వ‌స్తా.. ప్లాస్మా ఇస్తా' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆయ‌న కరోనా నుంచి త్వరగా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్థిస్తున్నారు.


ఆర్ఎక్స్ -100 టైటిల్‌తో తీసిన తొలి సినిమాతోనే అజయ్ భూపతి సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆయన ప్ర‌స్తుతం 'మ‌హా స‌ముద్రం' అనే సినిమా ప‌నుల‌ను పూర్తి చేసుకుంటున్నారు. క‌రోనా వ్యాప్తి కట్టడయ్యాక ఈ సినిమా షూటింగ్ కొనసాగించనున్నారు. కాగా, ఇప్పటికే సినీ పరిశ్రమలో పలువురికి కరోనా సోకిన విషయం తెలిసిందే.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.