Skip to main content

పోలవరం ప్రాజక్టుపై ప్రధాని మోదీకి సీఎం వైయస్ జగన్ లేఖ

 ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను విడుదల చేయాలని లేఖలో కోరారు. 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని... ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేసేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.  


కాగ్ ఆడిట్ రిపోర్టు, సవరించిన అంచనా వ్యయాలను ఇప్పటికే అందించామని చెప్పారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక పనుల కోసం ఈ ఏడాది జూన్‌ వరకు రూ.12,312.88 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని... ఇందులో రూ.8,507.26 కోట్లను పీపీఏ ద్వారా కేంద్రం రీయింబర్స్‌ చేసిందని... మిగిలిన రూ.3,805.62 కోట్లను తక్షణమే రియింబర్స్ చేయాలని కోరారు. సకాలంలో నిధులను విడుదల చేసేలా కేంద్ర జల్ శక్తి శాఖకు దిశానిర్దేశం చేయాలని కోరారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో పోలవరం పనులకు రూ. 15 వేల కోట్లు అవసరమని జగన్ తెలిపారు. విభజన చట్టం సెక్షన్ 90 ప్రకారం పోలవరంను కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని హామీ కూడా ఇచ్చిందని చెప్పారు. ప్రాజెక్టు పనులు 33.23 శాతం, హెడ్‌ వర్క్స్‌లో సివిల్‌ పనులు 71 శాతం, కుడికాలువ పనులు 92 శాతం, ఎడమ కాలువ పనులు 52 శాతం, భూసేకరణ, సహాయ, పునరావాస ప్యాకేజీ పనులు 19 శాతం పూర్తయ్యాయని తెలిపారు.  

Comments

Popular posts from this blog

జగన్‌తో మాకు మంచి సంబంధాలున్నాయి : కేటీఆర్‌

    ఆస్క్‌ మీ పేరుతో ట్విట్టర్‌లో నెటిజన్ల ప్రశ్నలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ ఏపీ సీఎం జగన్‌తో తమకు మంచి సంబంధాలే ఉన్నాయన్నాయని, అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని అన్నారు. అంతే కాకుండా ప్రైవేట్ ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై ఆయన స్పందించారు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నామని మరి కొన్ని ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి వసతులు ఉన్నాయని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరాలని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 23వేల కరోనా పరీక్షలు చేస్తున్నామని ఆ సంఖ్యను త్వరలో 40వేలకు పెంచుతామని అన్నారు. ఆరోగ్య శ్రీ పథకం ఆయుష్మాన్ భారత్ కంటే మెరుగైనదని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం కొత్తగా 5 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసిందన్నారు. అన్ని ఏరియా ఆస్పతుల్లో ఐసీయూ యూనిట్స్‌ మొదలుపెట్టామని, ఉచితంగా డయాలసిస్‌ కూడా నిర్వహిస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ప్రజా రవాణా తిరిగి ప్రారంభించే విషయంలో కేంద్రం అనుమతి కోసం వేచి చూస్తున్నామన్నార...

ఆర్టీసీ భూమలు లీజులు బయటపెట్టండి

భూములు కాజేసేందుకే ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్ర మండిపడ్డ రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌,అక్టోబర్‌7(జనం సాక్షి): ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. డీజిల్‌పై పన్నులతో ఆర్టీసీ కుదేలవుతోందన్నారు. విమానాల ఇంధనంపై వ్యాట్‌ను 16శాతం నుంచి ఒకశాతానికి తగ్గించారని తెలిపారు. ప్రభుత్వానికి ఏడాదికి రూ.300 నుంచి 500 కోట్ల నష్టం వస్తోందని చెప్పారు. ఆర్టీసీ డీజిల్‌పై వ్యాట్‌ ఎందుకు తగ్గించడం లేదని, వ్యాట్‌ తగ్గిస్తే ఆర్టీసీకి ఏడాదికి రూ.700 కోట్ల లాభం వస్తుందని తెలిపారు. విడిభాగాలపై రూ.150 కోట్ల పన్నులు విధిస్తోందని, బస్‌పాస్‌ రాయితీలు మూడేళ్లుగా రూ.700 కోట్లు బకాయిలున్నాయని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. నష్టాలను తగ్గించకుండా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని అన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచన సీఎం కేసీఆర్‌కు ఇప్పటికిప్పుడు రాలేదు. ఎలక్టిక్ర్‌ బస్సుల తయారీ కంపెనీ కోసమే ఆర్టీసీ ప్రైవేటీకరణ. మేఘా ప్రణాళికతోనే ఆర్టీసీ ప్రైవేటీకరణకు పథక రచన చేస్తున్నారు. రూ.50 వేల కోట్ల భూములను లీజుల పేరుతో కేసీఆర్‌ కుటుంబం తీసుకుంది. గౌలిగూడలో భూములను టీ...