Skip to main content

ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం: అలాంటి సినిమాలు తీయాలంటే రక్షణశాఖ అనుమతి తప్పనిసరి...



ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వేలాది సినిమాలు వచ్చాయి.  అందులో ఆర్మీ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి.  ఇటీవలే వచ్చిన యూరి సినిమా బంపర్ హిట్ కొట్టడంతో పాటు, అందులో మెయిన్ రోల్ పోషించిన విక్కీ కౌశల్ జాతీయ అవార్డు దక్కించుకున్నాడు. సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.  

అయితే, కొన్ని సినిమాల్లో ఆర్మీపై విమర్శలు చేస్తూ, విలన్ గా చూపిస్తున్న సంగతి తెలిసిందే.  దీంతో ఇండియన్ ఆర్మీ ఓ  కీలక నిర్ణయం తీసుకుంది.  ఇకపై ఆర్మీ నేపథ్యంలో సినిమాలు తీయాలంటే తప్పనిసరిగా రక్షణశాఖ అనుమతి తీసుకోవడం తో పాటు ఎన్ఓసి తీసుకోవాలి.  ఇక సినిమా రిలీజ్ అయ్యే ముందు సినిమాలోని ఆర్మీకి సంబంధించిన సన్నివేశాలను రక్షణశాఖకు చూపించి ఆమోదం పొందిన తరువాత మాత్రమే సినిమాలను రిలీజ్ చేయాలని ఇండియన్ ఆర్మీ పేర్కొన్నది.   ఇది గొప్ప నిర్ణయం అని చెప్పాలి.  మరి దీనిపై సినిమా ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Comments

Popular posts from this blog

అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట.. ఈ పాట' అంటూ కొత్త సినిమా సాంగ్ విడుదల చేసిన సాయితేజ్‌

 అంత స్ట్రిక్ట్‌గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృత ని చూశాక ఏమైంది?' అంటూ నిన్న సోలో బతుకే సో బెటరు సినిమాలోంచి ఓ పోస్టర్‌ను విడుదల చేసిన మెగా హీరో సాయితేజ్‌ ఈ రోజు ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు. 'అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట... ఈ పాట...' అంటూ సాయితేజ్‌ కామెంట్ చేశాడు. 'హేయ్  నేనేనా' అంటూ సాగే ఈ పాట అలరిస్తోంది. సుబ్బు డైరక్షన్ లో సోలో బతుకే సో బెటరు సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోంచి 'నో పెళ్లి' సాంగ్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే.                            

రాజధానిపై వచ్చేనెల 21వరకు స్టేటస్‌ కో

  రాజధాని అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చే నెల 21 నుంచి రోజు వారీ విచారణపై న్యాయవాదులతో ధర్మాసనం చర్చించింది. భౌతిక దూరం పాటిస్తే హైకోర్టులోనే విచారణ జరిపేందుకు సిద్ధమని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. రాజధాని, సీఆర్డీఏ చట్టం రద్దుపై  గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇవాళ్టితో ముగిశాయి. దీంతో సెప్టెంబరు 21 వరకు స్టేటస్‌ కో అమలు గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజధాని బిల్లులు అమలు చేయకుండా స్టేటస్‌ కో కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబరు 21కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నితీశ్‌ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. విశాఖలోని కాపులుప్పాడలో రాష్ట్ర ప్రభుత్వం భారీ అతిథిగృహాన్ని నిర్మించ తలపెట్టిందని, స్టేటస్‌ కో అమల్లో ఉన్నప్పుడు అతిథిగృహ నిర్మాణానికి శంకుస్థాపన ఏంటని పిటిషనర్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కార్యనిర్వాహక రాజధాని తరలింపులో ఇది కూడా భాగమేనని వాదనలు వినిపించారు. రాష్ట్రపతి...