Skip to main content

ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం: అలాంటి సినిమాలు తీయాలంటే రక్షణశాఖ అనుమతి తప్పనిసరి...



ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వేలాది సినిమాలు వచ్చాయి.  అందులో ఆర్మీ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి.  ఇటీవలే వచ్చిన యూరి సినిమా బంపర్ హిట్ కొట్టడంతో పాటు, అందులో మెయిన్ రోల్ పోషించిన విక్కీ కౌశల్ జాతీయ అవార్డు దక్కించుకున్నాడు. సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.  

అయితే, కొన్ని సినిమాల్లో ఆర్మీపై విమర్శలు చేస్తూ, విలన్ గా చూపిస్తున్న సంగతి తెలిసిందే.  దీంతో ఇండియన్ ఆర్మీ ఓ  కీలక నిర్ణయం తీసుకుంది.  ఇకపై ఆర్మీ నేపథ్యంలో సినిమాలు తీయాలంటే తప్పనిసరిగా రక్షణశాఖ అనుమతి తీసుకోవడం తో పాటు ఎన్ఓసి తీసుకోవాలి.  ఇక సినిమా రిలీజ్ అయ్యే ముందు సినిమాలోని ఆర్మీకి సంబంధించిన సన్నివేశాలను రక్షణశాఖకు చూపించి ఆమోదం పొందిన తరువాత మాత్రమే సినిమాలను రిలీజ్ చేయాలని ఇండియన్ ఆర్మీ పేర్కొన్నది.   ఇది గొప్ప నిర్ణయం అని చెప్పాలి.  మరి దీనిపై సినిమా ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.