Skip to main content

అత్యంత ప్రియమైన సంజయ్ భాయ్… చిరంజీవి

 



తాజా గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని నిర్ధారణ కావడంతో ప్రతి ఒక్కరు సంజయ్ తొందర గా కోలుకోవాలి అని సోషల్ మీడియా వేదికలో ఓదార్పు వచనాలు తెలియచేస్తున్నారు. అదే నేపథ్యం లో టాలీవుడ్ అగ్రహీరో చిరంజీవి కూడా సంజయ్ దత్ పరిస్థితి పట్ల చలించిపోయారు.

“అత్యంత ప్రియమైన సంజయ్ భాయ్… నువ్వింతటి తీవ్రమైన అనారోగ్య పరిస్థితులతో పోరాడుతున్నావని తెలిసి ఎంతో బాధగా ఉంది. కానీ నువ్వో ఫైటర్ వి. ఎన్నో ఏళ్లుగా అనేక సంక్షోభాలను అధిగమించావు. ఎలాంటి సందేహం లేదు, దీని నుంచి కూడా నువ్వు తప్పకుండా బయటికి వస్తావు. నువ్వు త్వరగా కోలుకోవాలని ప్రేమతో ప్రార్థిస్తున్నాం” అంటూ ట్వీట్ చేశారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.