Skip to main content

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ పిటీషన్ కొట్టివేత

 మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది.  ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ను ఎత్తివేయాలని కోరుతూ కేసులు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే.  సుప్రీంకోర్టులో ఈ కేసు ఈరోజు విచారణకు వచ్చింది.  జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎం ఆర్ షా ధర్మాసనం ముందుకు వచ్చిన కేసును విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఉత్తర్వులు ఇచ్చింది.  మధ్యంతర ఉత్తరువుల పై స్టే ఇవ్వలేమని న్యాయస్థానం పేర్కొన్నది.  సాధ్యమైనంత త్వరగా కేసు విచారణను ముగించాలని హైకోర్టు కు సుప్రీంకోర్టు సూచించింది.  సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు రేపు ఏపీ హైకోర్టులో ఈ కేసును విచారించబోతున్నారు.  

పరిపాలన సౌలభ్యం, మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది.  దీనికి సంబంధించిన బిల్లులపై గవర్నర్ కూడా సంతకం చేశారు.  దీంతో అమరావతి రైతులు హైకోర్టులో కేసులు దాఖలు చేయగా, హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చింది. మొదట ఆగష్టు 14 వరకు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు దానిని ఆగష్టు 27 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.  

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...