Skip to main content

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ పిటీషన్ కొట్టివేత

 మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది.  ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ను ఎత్తివేయాలని కోరుతూ కేసులు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే.  సుప్రీంకోర్టులో ఈ కేసు ఈరోజు విచారణకు వచ్చింది.  జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎం ఆర్ షా ధర్మాసనం ముందుకు వచ్చిన కేసును విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఉత్తర్వులు ఇచ్చింది.  మధ్యంతర ఉత్తరువుల పై స్టే ఇవ్వలేమని న్యాయస్థానం పేర్కొన్నది.  సాధ్యమైనంత త్వరగా కేసు విచారణను ముగించాలని హైకోర్టు కు సుప్రీంకోర్టు సూచించింది.  సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు రేపు ఏపీ హైకోర్టులో ఈ కేసును విచారించబోతున్నారు.  

పరిపాలన సౌలభ్యం, మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది.  దీనికి సంబంధించిన బిల్లులపై గవర్నర్ కూడా సంతకం చేశారు.  దీంతో అమరావతి రైతులు హైకోర్టులో కేసులు దాఖలు చేయగా, హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చింది. మొదట ఆగష్టు 14 వరకు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు దానిని ఆగష్టు 27 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.  

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.