ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారినపడి గత పదిరోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఆయన ఆరోగ్య సమాచారం పై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. బాలు ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు శనివారం సాయంత్రం తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్ బాలు ను పరామర్శించారు. బాలుకు అందుతున్న వైద్య చికిత్స వివరాల ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వైద్యానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. బాలుకు కరోనా నుండి కోలుకోవడానికి ప్లాస్మా చికిత్స అందిస్తున్నారని మరో రెండు రోజులు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తారని తెలిపారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments
Post a Comment