భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సోము వీర్రాజును
కలిశారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఏపీ బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు
చేపట్టిన సోము వీర్రాజుకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు చిరంజీవి..
పుష్పమాల, శాలువాతో సత్కరించిన చిరంజీవి... జనసేన అధినేత, తన తమ్ముడు
పవన్ కల్యాణ్తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని
సూచించారు.. 2024లో బీజేపీ, జనసేన పార్టీల పొత్తుతో ఉమ్మడిగా అధికారం
చేపట్టాలని ఆకాక్షించారు చిరంజీవి. కాగా, గత ఎన్నికల్లో వామపక్షాలతో
కలిసి ఎన్నికల్లో పోటీచేసిన పవన్ కల్యాణ్.. ఎన్నికల తర్వాత పలు
దఫాలుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసి.. ఆ
పార్టీకి చేరువైన సంగతి తెలిసిందే.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment