భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సోము వీర్రాజును
కలిశారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఏపీ బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు
చేపట్టిన సోము వీర్రాజుకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు చిరంజీవి..
పుష్పమాల, శాలువాతో సత్కరించిన చిరంజీవి... జనసేన అధినేత, తన తమ్ముడు
పవన్ కల్యాణ్తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని
సూచించారు.. 2024లో బీజేపీ, జనసేన పార్టీల పొత్తుతో ఉమ్మడిగా అధికారం
చేపట్టాలని ఆకాక్షించారు చిరంజీవి. కాగా, గత ఎన్నికల్లో వామపక్షాలతో
కలిసి ఎన్నికల్లో పోటీచేసిన పవన్ కల్యాణ్.. ఎన్నికల తర్వాత పలు
దఫాలుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసి.. ఆ
పార్టీకి చేరువైన సంగతి తెలిసిందే.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

Comments
Post a Comment