భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సోము వీర్రాజును
కలిశారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఏపీ బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు
చేపట్టిన సోము వీర్రాజుకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు చిరంజీవి..
పుష్పమాల, శాలువాతో సత్కరించిన చిరంజీవి... జనసేన అధినేత, తన తమ్ముడు
పవన్ కల్యాణ్తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని
సూచించారు.. 2024లో బీజేపీ, జనసేన పార్టీల పొత్తుతో ఉమ్మడిగా అధికారం
చేపట్టాలని ఆకాక్షించారు చిరంజీవి. కాగా, గత ఎన్నికల్లో వామపక్షాలతో
కలిసి ఎన్నికల్లో పోటీచేసిన పవన్ కల్యాణ్.. ఎన్నికల తర్వాత పలు
దఫాలుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసి.. ఆ
పార్టీకి చేరువైన సంగతి తెలిసిందే.
మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్షిప్లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్పైకి పంపే స్టార్ షిప్ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్ను తయారుచేసింది స్పేస్ ఎక...

Comments
Post a Comment