Skip to main content

తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో సుశాంత్ మనస్తాపం చెందాడన్న శివసేన నేత.. ఆగ్రహం వ్యక్తం చేసిన సుశాంత్ సోదరుడు

 

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ కేసులో బీహార్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినప్పటి నుంచి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.


 సుశాంత్ తండ్రి కేకే సింగ్ రెండో పెళ్లి చేసుకున్నాడని, ఆ వివాహం కారణంగా సుశాంత్ తన తండ్రిపై వ్యతిరేకతతో ఉన్నాడని, ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. సుశాంత్ తన తండ్రిని ఎన్నిసార్లు కలిశారో చెప్పాలని అన్నారు. సుశాంత్ చనిపోయిన 40 రోజుల తర్వాత కుటుంబ సభ్యులు బయటికి వచ్చారని, సుశాంత్ ముంబయిలో చనిపోతే పాట్నాలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని విమర్శించారు.

దీనిపై సుశాంత్ సోదరుడు నీరజ్ మండిపడ్డారు. సుశాంత్ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు అంటూ రౌత్ చేసిన వ్యాఖ్యల్లో నిజంలేదని, దీనిపై రౌత్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. అటు రౌత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ విభేదించారు. సుశాంత్ వ్యవహారంలో రౌత్ చేస్తున్న వ్యాఖ్యలు చవకబారుతనంగా ఉన్నాయని అన్నారు. ఇది ఎంతో సున్నితమైన అంశం అని, దీనిపై శివసేన స్పందిస్తున్న తీరు సరిగాలేదని విమర్శించారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.