Skip to main content

తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో సుశాంత్ మనస్తాపం చెందాడన్న శివసేన నేత.. ఆగ్రహం వ్యక్తం చేసిన సుశాంత్ సోదరుడు

 

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ కేసులో బీహార్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినప్పటి నుంచి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.


 సుశాంత్ తండ్రి కేకే సింగ్ రెండో పెళ్లి చేసుకున్నాడని, ఆ వివాహం కారణంగా సుశాంత్ తన తండ్రిపై వ్యతిరేకతతో ఉన్నాడని, ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. సుశాంత్ తన తండ్రిని ఎన్నిసార్లు కలిశారో చెప్పాలని అన్నారు. సుశాంత్ చనిపోయిన 40 రోజుల తర్వాత కుటుంబ సభ్యులు బయటికి వచ్చారని, సుశాంత్ ముంబయిలో చనిపోతే పాట్నాలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని విమర్శించారు.

దీనిపై సుశాంత్ సోదరుడు నీరజ్ మండిపడ్డారు. సుశాంత్ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు అంటూ రౌత్ చేసిన వ్యాఖ్యల్లో నిజంలేదని, దీనిపై రౌత్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. అటు రౌత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ విభేదించారు. సుశాంత్ వ్యవహారంలో రౌత్ చేస్తున్న వ్యాఖ్యలు చవకబారుతనంగా ఉన్నాయని అన్నారు. ఇది ఎంతో సున్నితమైన అంశం అని, దీనిపై శివసేన స్పందిస్తున్న తీరు సరిగాలేదని విమర్శించారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...