Skip to main content

పర్సనల్ విషయం చెబుతాడనుకుంటే.. జస్ట్ సినిమా గురించే చెప్పిన సాయితేజ్!

 


ప్రతిరోజూ పండగే' సినిమా విజయం సాధించడంతో ఫుల్ జోష్ మీద ఉన్న మెగా హీరో సాయిధరమ్ తేజ్‌ ప్రస్తుతం సుబ్బు డైరక్షన్ లో సోలో బతుకే సో బెటరు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే, సోమవారం ఉదయం 10 గంటలకు ఓ విషయం చెబుతానంటూ సాయితేజ్ తన ట్విట్టర్ ఖాతాలో నిన్న ఆసక్తికర వీడియో పోస్ట్ చేశాడు.


'ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి..' అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఇటీవల పెళ్లి చేసుకున్న టాలీవుడ్‌ హీరోలు నిఖిల్, నితిన్‌తో పాటు రానాల పేర్లను ప్రస్తావించాడు. అలాగే, సింగిల్‌గా ఉన్న ప్రభాస్‌కు టాటా చెప్పాడు. అయితే, ఈ రోజు తన పెళ్లి గురించి సాయితేజ్‌ ప్రకటన చేస్తాడని అభిమానులందరూ భావించారు.

తన పెళ్లి గురించి చెప్పకుండా సాయితేజ్‌ తన సినిమాలోని ఓ పాట గురించి ప్రకటన చేసి నిరాశపర్చాడు. ఇప్పటికే సోలో బతుకే సో బెటరు సినిమా  నుంచి ‘నో పెళ్లి’ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ పాటలో టాలీవుడ్ హీరోలు రానా, వరుణ్ తేజ్‌లు కూడా కనిపించి అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో పాటను విడుదల చేస్తున్నామంటూ ఆయన ప్రకటించాడు.  

'అంత స్ట్రిక్ట్‌గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృత ని చూశాక ఏమైంది???' అంటూ ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన విడుదల చేశాడు. 'హేయ్  నేనేనా' అంటూ సాగే ఈ పాటను ఈ నెల 26న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని చెప్పాడు. అయితే, పర్సనల్ విషయం గురించి చెబుతాడనుకుంటే సినిమా గురించి చెప్పాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...