Skip to main content

మెగా కుటుంబంలో మరో హీరోకి పెళ్లి.. సారీ ప్రభాస్‌ అన్న అంటూ ఆసక్తికర వీడియో పోస్ట్ చేసిన సాయితేజ్


 


 టాలీవుడ్ యంగ్‌ హీరోలకి వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మొదట నిఖిల్‌ పెళ్లి చేసుకున్నాడు. బ్యాచిలర్‌ లైఫ్‌కి గుడ్‌ బై చెప్పాడు. ఆ తర్వాత నితిన్‌కి పెళ్లి అయిపోయింది. సింగిల్‌ లైఫ్‌కి టాటా చెప్పేసి ఇంటివాడయ్యాడు. ఆ తర్వాత రానా కూడా అదే దారిలో పయనించాడు. ఇప్పుడు మెగా హీరో సాయి తేజ్ వంతు వచ్చేసింది.


టాలీవుడ్‌లో పెళ్లి కాని హీరోల జాబితాలో ప్రభాస్‌ను ఒంటరి చేసి సాయి తేజ్‌ కూడా సారీ చెప్పేసి బ్యాచిలర్ లైఫ్‌ నుంచి లెఫ్ట్‌ అయిపోతున్నాడు. ప్రస్తుతం 'సోలో బతుకే సో బెటరు' సినిమాలో నటిస్తోన్న సాయి తేజ్ నిజ జీవితంలో మాత్రం ఆ బతుకుకి టాటా చెప్పేయనున్నట్లు స్పష్టమైపోయింది.

తన పెళ్లికి సంబంధించిన ప్రకటనను రేపు ఉదయం 10 గంటలకు చేస్తానంటూ ఈ కుర్ర హీరో ఓ క్లూ ఇస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర వీడియో పోస్ట్ చేశాడు. 'ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి..' అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశాడు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.