Skip to main content

టిక్ టాక్ ను చేజిక్కించుకునేందుకు ట్విట్టర్ యత్నం!

 

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ను చేజిక్కించుకునేందుకు ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయ మీడియా సంస్థ 'బ్లూంబెర్గ్' ఆసక్తికర కథనం వెలువరించింది. ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ కూడా టిక్ టాక్ ను విలీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆ కథనంలో పేర్కొన్నారు. ట్విట్టర్ భారీ విలీనానికి సన్నద్ధమవుతోందని, చైనా సంస్థ బైట్ డ్యాన్స్ కు చెందిన టిక్ టాక్ ను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోందని వివరించింది.


అయితే, మైక్రోసాఫ్ట్ వంటి ట్రిలియన్ డాలర్ల దిగ్గజాన్ని కాదని, 29 బిలియన్ డాలర్ల విలువైన ట్విట్టర్ ఏ విధంగా టిక్ టాక్ ను టేకోవర్ చేస్తుందన్న సందేహాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఓవైపు సెప్టెంబరు 15 నాటికి టిక్ టాక్ తో తమ సంప్రదింపులు, చర్చలు పూర్తవుతాయని మైక్రోసాఫ్ట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టిక్ టాక్ కోసం ట్విట్టర్ ప్రయత్నిస్తోందన్న 'బ్లూంబెర్గ్' కథనం ఆసక్తి కలిగిస్తోంది.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.