Skip to main content

మన రెండు దేశాల ఘనమైన చరిత్రలో అదో చిన్న ఘటన మాత్రమే: చైనా

 ఈ సంవత్సరం జూన్ 15న భారత్, చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణ ఘటనను చైనా ప్రతినిధి సున్ వీడోంగ్ చాలా చిన్నదైనదని అభివర్ణించారు. తాజాగా నిర్వహించిన చైనా - ఇండియా యూత్ వెబినార్ లో మాట్లాడిన ఆయన, ఇదే అవాంఛనీయ ఘటనని, ఇరు దేశాల ఘనమైన చరిత్రలో అతి చిన్నదని, విభేదాలు పరిష్కరించుకుని, ముందుకు సాగాల్సిన సమయం ఇదని అన్నారు.


ఆగస్టు 18న ఈ వెబినార్ జరుగగా, నిన్న చైనా ఎంబసీ ఆయన ప్రసంగాన్ని విడుదల చేయడం గమనార్హం. ఇరు దేశాల మధ్యా ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు చైనా తక్షణం స్పందించాలని, సరిహద్దుల నుంచి సైనికులను వెనక్కు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేస్తున్న వేళ, సున్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఆయన ప్రసంగం యావత్తూ, రెండు దేశాల మధ్యా ఉన్న చరిత్ర గురించే ఎక్కువ సేపు సాగింది. వేలాది ఏళ్ల చరిత్ర, పౌర సమాజం, రెండు దేశాల మధ్యా రాకపోకలు, ప్రజల మధ్య సహకారం తదితరాలను ప్రస్తావించిన ఆయన, బేసిక్ చైనా విదేశాంగ విధానం, ఇండియాకు సంబంధించినంత వరకూ ఏ మాత్రమూ మారలేదని స్పష్టం చేశారు.

 జూన్ 15 నాటి ఘటనను గుర్తు చేసుకున్న ఆయన, "ఎంతో కాలం క్రితమేమీ కాదు. ఇటీవలే దురదృష్టవశాత్తూ జరిగిన ఘటనే ఇది. సరిహద్దుల్లో చైనాగానీ, ఇండియాగానీ దీన్ని ఆహ్వానించలేదు. దీన్నిప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మన దేశాల చరిత్రలో ఇది ఓ అతి చిన్న ఘటనగానే తీసుకోవాలి. ఇండియాను ప్రత్యర్థిగా చైనా చూడటం లేదు. ఇదే సమయంలో భారత్ నుంచి ముప్పు ఉందని కూడా అనుకోవడం లేదు" అని ఆయన అన్నారు.

సరిహద్దుల్లో నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలను ఇరు దేశాలూ కలిసి వెతుక్కోవాల్సిన అవసరం ఉందని, రెండు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాల మెరుగునకు కృషి చేయాలని అన్నారు. కాగా, చైనా అధికారి ప్రసంగంపై భారత్ ఇంకా స్పందించాల్సి వుంది.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...