Skip to main content

మన రెండు దేశాల ఘనమైన చరిత్రలో అదో చిన్న ఘటన మాత్రమే: చైనా

 ఈ సంవత్సరం జూన్ 15న భారత్, చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణ ఘటనను చైనా ప్రతినిధి సున్ వీడోంగ్ చాలా చిన్నదైనదని అభివర్ణించారు. తాజాగా నిర్వహించిన చైనా - ఇండియా యూత్ వెబినార్ లో మాట్లాడిన ఆయన, ఇదే అవాంఛనీయ ఘటనని, ఇరు దేశాల ఘనమైన చరిత్రలో అతి చిన్నదని, విభేదాలు పరిష్కరించుకుని, ముందుకు సాగాల్సిన సమయం ఇదని అన్నారు.


ఆగస్టు 18న ఈ వెబినార్ జరుగగా, నిన్న చైనా ఎంబసీ ఆయన ప్రసంగాన్ని విడుదల చేయడం గమనార్హం. ఇరు దేశాల మధ్యా ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు చైనా తక్షణం స్పందించాలని, సరిహద్దుల నుంచి సైనికులను వెనక్కు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేస్తున్న వేళ, సున్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఆయన ప్రసంగం యావత్తూ, రెండు దేశాల మధ్యా ఉన్న చరిత్ర గురించే ఎక్కువ సేపు సాగింది. వేలాది ఏళ్ల చరిత్ర, పౌర సమాజం, రెండు దేశాల మధ్యా రాకపోకలు, ప్రజల మధ్య సహకారం తదితరాలను ప్రస్తావించిన ఆయన, బేసిక్ చైనా విదేశాంగ విధానం, ఇండియాకు సంబంధించినంత వరకూ ఏ మాత్రమూ మారలేదని స్పష్టం చేశారు.

 జూన్ 15 నాటి ఘటనను గుర్తు చేసుకున్న ఆయన, "ఎంతో కాలం క్రితమేమీ కాదు. ఇటీవలే దురదృష్టవశాత్తూ జరిగిన ఘటనే ఇది. సరిహద్దుల్లో చైనాగానీ, ఇండియాగానీ దీన్ని ఆహ్వానించలేదు. దీన్నిప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మన దేశాల చరిత్రలో ఇది ఓ అతి చిన్న ఘటనగానే తీసుకోవాలి. ఇండియాను ప్రత్యర్థిగా చైనా చూడటం లేదు. ఇదే సమయంలో భారత్ నుంచి ముప్పు ఉందని కూడా అనుకోవడం లేదు" అని ఆయన అన్నారు.

సరిహద్దుల్లో నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలను ఇరు దేశాలూ కలిసి వెతుక్కోవాల్సిన అవసరం ఉందని, రెండు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాల మెరుగునకు కృషి చేయాలని అన్నారు. కాగా, చైనా అధికారి ప్రసంగంపై భారత్ ఇంకా స్పందించాల్సి వుంది.  

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.