Skip to main content

ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జ్!

 


కరోనా వైరస్ ను జయించి, ఆపై అనారోగ్యం బారినపడిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి ఈ ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ నెల 2వ తేదీన అమిత్ షాకు కొవిడ్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై ఆయన నిపుణుల సూచనతో గురుగ్రామ్ లోని మేదాంత హాస్పిటల్ చేరి, 12 రోజుల చికిత్స అనంతరం 14న ఇంటికి వెళ్లారు.

ఆపై ఆయన తీవ్రమైన అలసట, ఒళ్లునొప్పులు బారిన పడి, 18న ఎయిమ్స్ లో చేరారు. ఆసుపత్రిలోని అత్యుత్తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన క్రమంగా కోలుకున్నారు. ప్రస్తుతం అమిత్ షా పూర్తి అరోగ్యంగా ఉన్నారని, అందువల్ల డిశ్చార్జ్ చేశామని అధికారులు వెల్లడించారు.  

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

‘సైరా’ పూర్తయింది.. బాధేస్తోంది: చరణ్‌ సినిమాకు ఒక్కరోజు ముందు చెర్రీ ఎమోషనల్‌ పోస్ట్‌

‘సైరా’ పూర్తయింది.. బాధేస్తోంది: చరణ్‌ సినిమాకు ఒక్కరోజు ముందు చెర్రీ ఎమోషనల్‌ పోస్ట్‌ చదవండి