పాలనా వికేంద్రీకరణ (మూడు రాజధానులు), సీఆర్డీఏ రద్దు అంశాలపై ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టే వెకేషన్ పిటిషన్ ను దాఖలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని పిటిషన్ లో కోరింది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై ఇప్పటికే ఐకాస, అమరావతి రైతులు కేవియట్ దాఖలు చేశారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

Comments
Post a Comment