Skip to main content

గాలి ద్వారా కరోనా.. రెండు మీటర్ల భౌతికదూరంతో ఉపయోగం లేదు:..

 

ప్రస్తుతం మనం పాటిస్తున్న రెండు మీటర్లు లేదా ఆరు అడుగుల భౌతికదూరం వల్ల ఉపయోగం లేదని ఫ్లోరిడా యూనివర్శిటీ వైరాలజీ విభాగానికి చెందిన పరిశోధకులు అన్నారు. ఇండోర్ వాతావరణంలో 2 నుంచి 4.8 మీటర్ల వరకు గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని తెలిపారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే... ఇప్పుడు అనుసరిస్తున్న మార్గదర్శకాలను సవరించాలని సూచించారు. ఈ మేరకు మెడ్ రెక్సివ్ లో ప్రచురితమైన తమ పరిశోధనాపత్రంలో పేర్కొన్నారు.

దగ్గుతూ, చీదుతూ మాట్లాడేవారి సమీపంలో గాలిని పీల్చడం ద్వారా కరోనా సోకుతుందని పరిశోధకులు చెప్పారు. జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి వెళ్లకపోవడమే మంచిదని... ముఖాన్ని కవర్ చేసుకోవడంలో కూడా జాగ్రత్త అవసరమని సూచించారు. కార్యాలయాల్లో మనం పాటిస్తున్న రెండు మీటర్ల భౌతికదూరం... ఉద్యోగుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందని చెప్పారు.

గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపించదని తొలుత ప్రపంచ ఆరోగ్య సంస్థ వాదించిన సంగతి తెలిసిందే. అయితే, గాలి ద్వారా వైరస్ సంక్రమిస్తుందని చెప్పడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని 239 మంది శాస్త్రవేత్తలు లేఖలు రాయడంతో... ఈ వాదనను డబ్ల్యూహెచ్ఓ అంగీకరించింది.  

Comments

Popular posts from this blog

బలపరీక్ష ఎప్పుడు నిర్వహించినా సిద్ధం.. తమ ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఆ పార్టీల అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ ఏ రోజు జరిగినా దానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. ముంబయిలోని పోవైలో ఉన్న ఓ హోటల్ కు నిన్న రాత్రే ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో చేరుకున్నారు. శివసేన నుంచి 56 మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. వారిలో 55 మంది  అధేరీలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అలాగే, వారి నుంచి ఆ పార్టీ అధిష్ఠానం సెల్ ఫోన్ లను తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ 44 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్ కి తరలించింది. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పటేల్ మీడియాకు చెప్పారు. 

రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారయ్యిందన్నట్లు మాట్లాడి ఓ బీజేపీ ఎమ్మెల్యే సంచలనానికి తెరతీశారు. నవంబరు 18వ తేదీన నిర్మాణం ప్రారంభమవుతుందంటూ డేట్‌ కూడా ఫిక్స్‌ చేసేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో వుంది. రామాలయ నిర్మాణం విషయంలో శుభవార్త వింటారని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ రెండు రోజుల క్రితమే వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...రాజస్థాన్‌ రాష్ట్రం పాలి జిల్లా కేంద్రంలో జరిగిన రాంలీలా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గైన్‌చంద్‌ పరఖ్‌ మాట్లాడారు. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న రామజన్మభూమి కేసు నవంబరు 17వ తేదీ నాటికి కొలిక్కి వస్తుందని, 18వ తేదీన రామమందిర నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.