Skip to main content

ఫేస్‌బుక్‌లోనూ టిక్‌టాక్‌ తరహా షార్ట్ వీడియోస్ ఫీచర్!

 సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ కొత్తగా 'షార్ట్‌ వీడియో' అనే ఫీచర్‌ను‌ తీసుకురానుంది. షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌పై భారత్‌ నిషేధం విధించడంతో పాటు అమెరికాలోనూ నిషేధం విధించే అవకాశాలు ఉండడంతో ఫేస్‌బుక్‌ కూడా ఆ తరహా షార్ట్ వీడియో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే కొంతమందికి ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. 


న్యూస్‌ఫీడ్‌ మధ్యలో బ్లాక్స్‌లా షార్ట్ వీడియోస్‌ ఫీచర్ ఉంటుంది. ఇందులో చిన్న వీడియోలను యూజర్లు రూపొందించుకోవచ్చు. ఇందులో మనం పోస్ట్ చేసిన వీడియోకి ఎన్ని వ్యూస్‌ వచ్చాయన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఫేస్‌బుక్‌ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ అనే ఓ ఆప్షన్ తీసుకువచ్చి షార్ట్ వీడియోలను పోస్ట్ చేసుకునేలా సౌలభ్యం కలిగించిన విషయం తెలిసిందే.

షార్ట్ వీడియోలకు అత్యధిక ఆదరణ వస్తుండడంతో యూట్యూబ్ కూడా షార్ట్‌ పేరుతో వీడియో ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. అంతేగాక, షార్ట్ వీడియో యాప్‌లను తీసుకురావడానికి ప్రపంచంలోని పలు దిగ్గజ సంస్థలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. షార్ట్ వీడియోలు యూజర్ల సమయాన్ని వృథా చేయకుండా, బోర్‌ కొట్టించకుండా ఉంటుండడంతో వీటికి బాగా ఆదరణ వస్తోంది.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...