Skip to main content

ఫేస్‌బుక్‌లోనూ టిక్‌టాక్‌ తరహా షార్ట్ వీడియోస్ ఫీచర్!

 సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ కొత్తగా 'షార్ట్‌ వీడియో' అనే ఫీచర్‌ను‌ తీసుకురానుంది. షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌పై భారత్‌ నిషేధం విధించడంతో పాటు అమెరికాలోనూ నిషేధం విధించే అవకాశాలు ఉండడంతో ఫేస్‌బుక్‌ కూడా ఆ తరహా షార్ట్ వీడియో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే కొంతమందికి ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. 


న్యూస్‌ఫీడ్‌ మధ్యలో బ్లాక్స్‌లా షార్ట్ వీడియోస్‌ ఫీచర్ ఉంటుంది. ఇందులో చిన్న వీడియోలను యూజర్లు రూపొందించుకోవచ్చు. ఇందులో మనం పోస్ట్ చేసిన వీడియోకి ఎన్ని వ్యూస్‌ వచ్చాయన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఫేస్‌బుక్‌ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ అనే ఓ ఆప్షన్ తీసుకువచ్చి షార్ట్ వీడియోలను పోస్ట్ చేసుకునేలా సౌలభ్యం కలిగించిన విషయం తెలిసిందే.

షార్ట్ వీడియోలకు అత్యధిక ఆదరణ వస్తుండడంతో యూట్యూబ్ కూడా షార్ట్‌ పేరుతో వీడియో ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. అంతేగాక, షార్ట్ వీడియో యాప్‌లను తీసుకురావడానికి ప్రపంచంలోని పలు దిగ్గజ సంస్థలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. షార్ట్ వీడియోలు యూజర్ల సమయాన్ని వృథా చేయకుండా, బోర్‌ కొట్టించకుండా ఉంటుండడంతో వీటికి బాగా ఆదరణ వస్తోంది.  

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...