Skip to main content

హ్యాపీ నెస్ట్‌ భవనాల నిర్మాణం పూర్తి చేయండి’ అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం


అమరావతి మెట్రోపాలిటన్‌ ప్రాంత అభివృద్ధి  సంస్థపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అమరావతిలో ప్రస్తుత నిర్మాణాల పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవనాలు పూర్తి చేసే కార్యాచరణపై చర్చించారు. నిర్మాణలు పూర్తి చేయడం కోసం నిధుల సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఆర్థికశాఖ అధికారులతో చర్చించి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. హ్యాపీ నెస్ట్‌ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. 

Comments