Skip to main content

ట్రంప్ తల ఆకారంలో మత్తు మాత్రలు... తయారీదారుల క్రియేటివిటీకి బ్రిటన్ పోలీసులు ఫిదా!B

 



తాజాగా బ్రిటన్ లో బెడ్ ఫోర్డ్ షైర్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి అతడి నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఆరెంజ్ కలర్ లో ఉన్న మాత్రలను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ మాత్రలు అచ్చం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలను పోలివున్నాయి. ట్రంప్ తలకట్టును ఆధారంగా చేసుకుని ఆ మాత్రను డిజైన్ చేసిన వాటి తయారీదార్ల క్రియేటివిటీకి బ్రిటన్ పోలీసులు ఆశ్చర్యపోయారు. 


కాగా, ఈ ఆరెంజ్ కలర్ మాత్రలను ట్రంప్ పిల్స్ పేరుతో అమ్మకాలు సాగిస్తుంటారని బ్రిటన్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వీటిలో ప్రమాదకరమైన ఎండీఎంఏ అనే పదార్థం ఉంటుందని, వీటిని వాడితే గొంతు ఎండిపోయి, హృదయస్పందన వేగం పుంజుకుంటుందని, తీవ్ర అస్వస్థతకు గురవుతారని నిపుణులు చెబుతున్నారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...