Skip to main content

ఆదిత్య 999 స్టోరీతో బాల‌య్య వార‌సుడి సినిమా !



ఆదిత్య 369 డిఫారెంట్ స్టోరీతో ఆక‌ట్టుకున్నద‌ర్శ‌కుడు సంగీతం శ్రీ‌నివాస‌రావు. ఈ చిత్రానికి శివ‌లంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మాత‌గా వ్య‌వ‌హించారు. ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌, మోహినిఅమ్రిష్ పూరి, టిన్ను ఆనంద్‌, త‌రుణ్ కుమార్లు లీడ్ రోల్స్ పోషించారు. సంగీతం, సినిమాటోగ్రాఫీల‌ను ఇళ‌య‌రాజా, వీఎస్ఆర్ స్వామి చూసుకున్నారు. ఆదిత్య 369 చిత్రంలో టైమ్ మిష‌న్ ప్ర‌జెంట్ టైం నుంచి పాస్ట్ టైంలోకి తీసుకెళ్లుంది. సంగీతం శ్రీ‌నివాస్‌రావు ఆధ్వ‌ర్యంలో ఆదిత్య 999 చిత్రం వ‌స్తుంద‌ని గ‌తంలో రూమ‌ర్స్ వినిపించాయి. అందులో బాల‌య్య న‌టిస్తున్న‌ర‌ని కూడా విన్నాం. బాల‌య్య‌కు అనుకున్న ప్రాజెక్టు ఆదిత్య 999లో అనూహ్యంగా ఆయ‌న వార‌సుడు మోక్ష‌జ్ఞ వ‌చ్చారు. మ‌రి మోక్ష‌జ్ఞ న‌టిస్తారో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. అప్ప‌టి వ‌ర‌కు రూమ‌ర్‌గానే భావించాల్సి ఉంటుంది.


ఆదిత్య 369 చిత్రం నంద‌మూరి బాల‌కృష్ణ‌కు పెద్ద హిట్ ఇచ్చింది. రెండు నంది అవార్డులు, బెస్ట్‌ కాస్టూమ్స్ డిజైన్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్ అవార్డుల‌ను ద‌క్కించుకుంది. ఇది అప్ప‌ట్లో ఇండ‌స్ర్టీ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం సైంటిస్ట్ రాందాస్‌తో మొద‌లవుతోంది. రాందాస్ త‌న ఇంటిలోనే ఏర్పాటు చేసుకున్న ల్యాబ్‌లో ప్ర‌యోగాలు చేస్తుంటారు. అందులో ఈ టైం మిష‌న్ ఒక్కటి. దానిని విజ‌య‌వంతంగా తీర్చిదిద్దుతాడు. అత‌ని కూతురే హేమ‌, ఆమె ప్రియుడు కృష్ణ కుమార్‌(బాల‌కృష్ణ‌) ఊహించ‌ని విధంగా టైం మిష‌న్తో స‌హా శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు జీవించి ఉన్న క్రీ.శ 1522 కాలానికి వెళ‌తారు. మ‌ర‌లా భ‌విష్య‌త్తు కాలానికి వెళ‌తారు. 2504 మూడో ప్ర‌పంచ యుద్ధం ముగిసిన త‌ర్వాత భూమి మీద‌ రేడియోష‌న్ ప్ర‌భావం నెల‌కొని ఉంటుంది.

ఇలా కొన్ని ముఖ్య అంశాల‌తో ఈ చిత్రం స‌మ్మిళ‌తై ఉంటుంది.  శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు హ‌యాం నాటి డైమాండ్ మ్యూజియంలో అత్యంత భ‌ద్ర‌త‌ల మ‌ధ్య ఉంటుంది. ఈ మ్యూజియంలో ఉన్న‌డైమాండ్‌ను పేరుమోసిన దొంగ రాజ‌వ‌ర్మ అత్య‌ధిక విలువ గ‌ల వ‌స్తువుల‌ను చోరీ చేస్తుండ‌డం హాబీగా పెట్టుకుంటాడు. ఓరిజిన‌ల్ డైమాండ్నుదొంగ‌త‌నం చేస్తుండ‌గా స్కూల్ విద్యార్థి కిషోర్ చూస్తాడు. అయితే స్కూల్ ఎక్స్‌క‌ర్ష‌న్ రీత్యా వ‌చ్చి మ్యూజియంలో చిక్కుకుపోతాడు. దొంగ‌ల నుంచి త‌ప్పించుకు నేందుకు య‌త్నిస్తుంటాడు. రంగంలోకి దిగిన కృష్ణ కుమార్ అత‌డిని ర‌క్షిస్తాడు. త‌ర్వాత రాజ‌వ‌ర్మ‌కు కృష్ణ కుమార్‌కు మ‌ధ్య గొడ‌వ‌తో రాజ‌వ‌ర్మ చ‌నిపోతాడు. ఇదీ ఆదిత్య 369 హిట్ స్టోరీ గురించి.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...