Skip to main content

టిక్‌టాక్‌కు ట్రంప్‌ 90రోజుల డెడ్‌లైన్‌

 


ప్రముఖ వీడియో యాప్‌ టిక్‌టాక్‌కు ట్రంప్‌ కొంత ఊరటనిచ్చారు. అమెరికాలో ఆ కంపెనీ కార్యకలాపాల్ని నిలిపివేయడమో లేదా తమ దేశకంపెనీకి విక్రయించడమో చేసేందుకు ఇచ్చిన గడువును తాజాగా పొడిగించారు. గతంలో ఈ గడువు 45 రోజులు కాగా.. దాన్ని మరో 45 రోజులు పొడిగించారు. ఈ మేరకు మరో కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు. దీంతో టిక్‌టాక్‌కు నవంబర్‌ 12 వరకు గడవు లభించింది.

ఈ ఉత్తర్వుల ప్రకారం నిర్దేశించిన గడువులోగా టిక్‌టాక్‌ అమ్మకం ప్రక్రియను బైట్‌డ్యాన్స్‌ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే అమెరికన్ యూజర్ల డేటాను కూడా పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. అమెరికా జాతీయ భద్రతను బైట్‌డ్యాన్స్‌ ప్రమాదంలోకి నెట్టివేస్తుందనడానికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ ట్రంప్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలన్ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ ముందుకొచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, భారత్‌ కార్యకలపాలను కూడా కొనుగోలు చేసేందుకు ఆ సంస్థ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మరో వైపు ట్విటర్‌ కూడా టిక్‌టాక్‌ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...