Skip to main content

ప్లాస్మా దాతకు 5 వేలు


 

ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చిన వారికి రూ.5000 ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. కొవిడ్‌ బాధితుల్ని కాపాడాలంటే ప్లాస్మా థెరపీ ముఖ్యమని, కరోనాను జయించిన ప్రతి ఒక్కరూ ప్లాస్మా దా నానికి ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాం పు కార్యాలయంలో కొవిడ్‌ కట్టడి, ఆస్పత్రుల్లో వైద్యం, వైద్య విద్యా వ్యవస్థలోని నా డు-నేడుపై సీఎం జగన్‌ సమీక్షించారు. ప్లాస్మా థెరపీపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. దాతలకిచ్చే రూ.5 వేలు మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఉపయోగపడుతుందన్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఉండరాదని సూచించారు. బెడ్ల వివరాలను హెల్ప్‌డె్‌స్కలో ఉంచాలని, ఎవరికైనా బెడ్‌ అందుబాటులో లేదంటే సమీపంలోని ఆస్పత్రిలో బెడ్‌ కేటాయించేలా అక్కడ నుంచే ఏర్పాట్లు చేయాలన్నారు. ౅హెల్ప్‌ డెస్క్‌లో సక్రమంగా విధులు నిర్వహిస్తే చాలా వరకూ సమస్యలు తగ్గుతాయన్నారు. కరోనా కోసం నిర్దేశించిన 138 ఆస్పత్రుల యాజమాన్యంపై జాయింట్‌ కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు.


 రాజధానుల బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో తర్వాతి పరిణామాలపై చర్చించేందుకు జనసేన పార్టీ రెడీ అయ్యి...

Read more at: https://telugu.asianetnews.com/andhra-pradesh/janasena-chief-pawan-kalyan-hold-meeting-for-amaravati-farmers-qee5an

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.