Skip to main content

4G-Only iPhone 12: ఐఫోన్ 12 సిరీస్ లో చౌకైన ఫోన్ కావచ్చు



4G -Only iPhone 12 యొక్క చవక మోడల్, కేవలం 4G- సపోర్ట్ తో మాత్రమే వస్తుందని రూమర్

iPhone 12 మరియు 12 Pro ఫోన్లు రెండూ అక్టోబర్‌ లో మొదటి వేవ్‌ లో లాంచ్ అవుతాయని ఊహిస్తున్నారు

ప్రస్తుత ఆపిల్ సరసమైన ఫోన్ iPhone SE వంటి ఫోన్ ‌లతో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులను సంపాదించానికి కృషి చేస్తున్నట్లు అర్ధమౌతోంది.


iPhone 12 గురించి  నెట్టింట్లో వస్తున్న రూమర్లు నిజమైతే కనుక, ఈ సారి iPhone తీసుకురానున్న iPhone 12 లైనప్ చాలా విస్తృతమైనది మరియు ఉత్తేజకరమైనదిగా ఉండవచ్చు. నెక్స్ట్ జెనరేషన్ ఐఫోన్ సరికొత్త డిజైన్, సన్నని బెజెల్ మరియు 5G  సపోర్ట్ కలిగి ఉందనే రూమర్ ఉంది. ఏదేమైనా, 2021 ప్రారంభంలో 5 జి మద్దతు లేకుండా చౌకైన ఐఫోన్ 12 వస్తుందని కొత్త నివేదిక సూచిస్తుంది.

 ఈ ఐఫోన్ 12 యొక్క చవక మోడల్, కేవలం 4G- సపోర్ట్ తో మాత్రమే వస్తుందని, ఈ మోడల్ ధర సుమారు $ 800 (సుమారు రూ .60,000) ఉందవచ్చని మరియు ప్రస్తుత ఆపిల్ సరసమైన ఫోన్ iPhone SE వంటి ఫోన్ ‌లతో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులను సంపాదించానికి కృషి చేస్తున్నట్లు అర్ధమౌతోంది.

ఆపిల్ 2021 ప్రారంభంలో, చౌకైన 4G -Only iPhone 12 ను విడుదల చేయనుంది. కంపెనీ త్రైమాసిక ఆదాయాల కాల్ సందర్భంగా ఆపిల్ CFO లూకా మేస్త్రీ మాట్లాడినప్పుడు iPhone 12 ప్రొడక్షన్ వెనుకబడిందని ఆపిల్ ఇప్పటికే ధృవీకరించింది.

ఒక 6.1-అంగుళాల iPhone 12 మరియు 12 Pro ఫోన్లు రెండూ అక్టోబర్‌ లో మొదటి వేవ్‌ లో లాంచ్ అవుతాయని, 5.4-అంగుళాల iPhone 12 మరియు 6.7-అంగుళాల iPhone 12 Pro తరువాతి కాలంలో విడుదల చేయబడతాయని, ఇది బహుశా నవంబర్‌ లో కావచ్చని తెలిపింది. ఈ విషయాలన్నిటిని చూస్తుంటే, 2021 ప్రారంభంలో చౌకైన 4G -Only iPhone 12 విడుదల గురించి సరిపోలుతున్నాయి.

ఇక ఇతర iPhone వార్తలలో, ఈ ఐఫోన్ 12 ప్రో ఫోను ఎక్కువగా రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కలిగి ఉండవు. ఇంజనీర్లు బ్యాటరీ జీవితానికి సంబంధించి ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.

Comments

Popular posts from this blog

పుట్టినరోజు కేక్ కట్ చేయడంపై తన అభిప్రాయాలు వెల్లడించిన పవన్ కల్యాణ్

 జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం (సెప్టెంబరు 2) సందర్భంగా ఆయన అభిమానుల్లో కోలాహలం నెలకొంది. ఆయన మాత్రం ఎప్పటిలాగానే ఎంతో కూల్ గా కనిపించారు. తన బర్త్ డే సందర్భంగా పెద్దగా ఎప్పుడూ కేకులు కట్ చేయని పవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తనకు బర్త్ డే వేడుకలపై ఆసక్తి తక్కువని తెలిపారు. ఒకట్రెండు సార్లు స్కూల్లో చాక్లెట్లు పంచానని, కొన్ని సందర్భాల్లో తన కుటుంబ సభ్యులు కూడా తన పుట్టినరోజు సంగతి మర్చిపోయేవారని వెల్లడించారు. ఎప్పుడైనా తన పుట్టినరోజు సంగతి గుర్తొస్తే వదిన డబ్బులు ఇచ్చేవారని, ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవడం తప్ప ప్రత్యేకమైన వేడుకలు తక్కువేనని పవన్ వివరించారు. "ఇక సినీ రంగంలోకి వచ్చిన తర్వాత నా పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్, నిర్మాతలు చేస్తుంటే ఇబ్బందికరంగా అనిపించేది. కేకు కోయడం, ఆ కేకు ముక్కలను నోట్లో పెట్టడం అంతా ఎబ్బెట్టుగా అనిపించేది. అందుకే జన్మదిన వేడుకలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు... దీనికి వేరే కారణాలేవీ లేవు" అని పవన్ తెలిపారు.  

బలపరీక్ష ఎప్పుడు నిర్వహించినా సిద్ధం.. తమ ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఆ పార్టీల అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ ఏ రోజు జరిగినా దానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. ముంబయిలోని పోవైలో ఉన్న ఓ హోటల్ కు నిన్న రాత్రే ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో చేరుకున్నారు. శివసేన నుంచి 56 మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. వారిలో 55 మంది  అధేరీలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అలాగే, వారి నుంచి ఆ పార్టీ అధిష్ఠానం సెల్ ఫోన్ లను తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ 44 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్ కి తరలించింది. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పటేల్ మీడియాకు చెప్పారు.