Skip to main content

4G-Only iPhone 12: ఐఫోన్ 12 సిరీస్ లో చౌకైన ఫోన్ కావచ్చు



4G -Only iPhone 12 యొక్క చవక మోడల్, కేవలం 4G- సపోర్ట్ తో మాత్రమే వస్తుందని రూమర్

iPhone 12 మరియు 12 Pro ఫోన్లు రెండూ అక్టోబర్‌ లో మొదటి వేవ్‌ లో లాంచ్ అవుతాయని ఊహిస్తున్నారు

ప్రస్తుత ఆపిల్ సరసమైన ఫోన్ iPhone SE వంటి ఫోన్ ‌లతో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులను సంపాదించానికి కృషి చేస్తున్నట్లు అర్ధమౌతోంది.


iPhone 12 గురించి  నెట్టింట్లో వస్తున్న రూమర్లు నిజమైతే కనుక, ఈ సారి iPhone తీసుకురానున్న iPhone 12 లైనప్ చాలా విస్తృతమైనది మరియు ఉత్తేజకరమైనదిగా ఉండవచ్చు. నెక్స్ట్ జెనరేషన్ ఐఫోన్ సరికొత్త డిజైన్, సన్నని బెజెల్ మరియు 5G  సపోర్ట్ కలిగి ఉందనే రూమర్ ఉంది. ఏదేమైనా, 2021 ప్రారంభంలో 5 జి మద్దతు లేకుండా చౌకైన ఐఫోన్ 12 వస్తుందని కొత్త నివేదిక సూచిస్తుంది.

 ఈ ఐఫోన్ 12 యొక్క చవక మోడల్, కేవలం 4G- సపోర్ట్ తో మాత్రమే వస్తుందని, ఈ మోడల్ ధర సుమారు $ 800 (సుమారు రూ .60,000) ఉందవచ్చని మరియు ప్రస్తుత ఆపిల్ సరసమైన ఫోన్ iPhone SE వంటి ఫోన్ ‌లతో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులను సంపాదించానికి కృషి చేస్తున్నట్లు అర్ధమౌతోంది.

ఆపిల్ 2021 ప్రారంభంలో, చౌకైన 4G -Only iPhone 12 ను విడుదల చేయనుంది. కంపెనీ త్రైమాసిక ఆదాయాల కాల్ సందర్భంగా ఆపిల్ CFO లూకా మేస్త్రీ మాట్లాడినప్పుడు iPhone 12 ప్రొడక్షన్ వెనుకబడిందని ఆపిల్ ఇప్పటికే ధృవీకరించింది.

ఒక 6.1-అంగుళాల iPhone 12 మరియు 12 Pro ఫోన్లు రెండూ అక్టోబర్‌ లో మొదటి వేవ్‌ లో లాంచ్ అవుతాయని, 5.4-అంగుళాల iPhone 12 మరియు 6.7-అంగుళాల iPhone 12 Pro తరువాతి కాలంలో విడుదల చేయబడతాయని, ఇది బహుశా నవంబర్‌ లో కావచ్చని తెలిపింది. ఈ విషయాలన్నిటిని చూస్తుంటే, 2021 ప్రారంభంలో చౌకైన 4G -Only iPhone 12 విడుదల గురించి సరిపోలుతున్నాయి.

ఇక ఇతర iPhone వార్తలలో, ఈ ఐఫోన్ 12 ప్రో ఫోను ఎక్కువగా రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కలిగి ఉండవు. ఇంజనీర్లు బ్యాటరీ జీవితానికి సంబంధించి ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...