Skip to main content

రాజుగారి గది 4'కి దర్శకుడు ఓంకార్ సన్నాహాలు!

 ఇటీవలి కాలంలో తెలుగులో సీక్వెల్స్ నిర్మాణం పెరుగుతోంది. ఒక సినిమా హిట్టయితే కనుక దానికి సీక్వెల్ ను ప్లాన్ చేసేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సినిమా ముగింపును కూడా రూపొందిస్తున్నారు. చిత్రకథను కొనసాగించే అవకాశం ఉండేలా సినిమా ముగింపును ఇస్తున్నారు. ఈ క్రమంలో 'రాజుగారి గది' సినిమాకు త్వరలో నాలుగో ఎడిషన్ ను తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి.


ప్రముఖ టీవీ యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారి, ఐదేళ్ల క్రితం 'రాజుగారి గది' పేరిట ఓ హారర్ థ్రిల్లర్ ను రూపొందించాడు. అది అనూహ్యమైన విజయం సాధించడంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా 'రాజుగారి గది 2' చిత్రాన్ని నిర్మించారు. అందులో నాగార్జున కథానాయకుడుగా నటించడంతో దానికి మంచి క్రేజ్ వచ్చింది.

ఆ తర్వాత 'రాజుగారి గది 3'ని తెరకెక్కించారు. ఇందులో ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా, అవికా గోర్ హీరోయిన్ గా నటించారు. ఇది కూడా ఫరవాలేదనిపించింది. ఈ క్రమంలో 'రాజుగారి గది 4' చిత్ర నిర్మాణానికి దర్శకుడు ఓంకార్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.