Skip to main content

మీకోసం పోరాటం’ పేరుతో 49 అంశాలతో ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన ట్రంప్

 అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ నుంచి అధికారికంగా నామినేషన్ స్వీకరించిన అనంతరం వైట్‌హౌస్‌లో ట్రంప్ దాదాపు 70 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘మీ కోసం పోరాటం’ పేరుతో 49 అంశాలతో కూడిన ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. గత నాలుగేళ్లలో తాను చేసిన అభివృద్ధి గురించి, తిరిగి అధికారంలోకి వస్తే వచ్చే నాలుగేళ్లలో తాను ఏం చేయబోయేది వివరించారు. అమెరికాను మరోమారు సూపర్ పవర్‌గా నిలబెట్టడమే తన లక్ష్యమన్నారు.


చైనాకు తరలిపోయిన కంపెనీలు, ఉద్యోగాలను తిరిగి రప్పిస్తామన్నారు. చంద్రుడిపైకి మహిళను పంపడంతోపాటు అంగారకుడిపై అమెరికా జెండా ఎగురవేస్తామన్నారు.  చైనాపై ఆధారపడడాన్ని తగ్గిస్తామన్నారు. అమెరికా చరిత్రలోనే లేని విధంగా ఘనమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తామన్నారు.

ప్రస్తుత అధ్యక్ష ఎన్నికలు అమెరికా కలలు, అరాచకవాదానికి మధ్య జరుగుతున్న పోరుగా ట్రంప్ అభివర్ణించారు. అమెరికాకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదని ట్రంప్ పేర్కొన్నారు. మనకు సాధ్యం కానిది ఏదీ లేదని ప్రపంచానికి చాటి చెబుతానన్నారు. అమెరికన్ జీవన విధానాన్ని కాపాడుకోవాలా? లేక విధ్వంసం సృష్టించే రాడికల్ ఉద్యమాలకు అనుమతి ఇవ్వాలా? తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రత్యర్థి జో బైడెన్‌పైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన అమెరికా వారసత్వ విధ్వంసకుడని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఉద్యోగాలు విదేశాలకు తరలిపోవడంలో ఆయన పాత్ర ఉందన్నారు. ఉద్యమాల పేరుతో డెమోక్రాట్లు దేశాన్ని ముక్కలు చేస్తున్నారని ఆరోపించారు. సామ్యవాదానికి బైడెన్ గెలుపు గుర్రంలా మారారని విమర్శించారు. కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నామని పేర్కొన్న ట్రంప్.. కరోనా వైరస్‌కు చైనాదే పూర్తి బాధ్యత అని పునరుద్ఘాటించారు.  

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...