Skip to main content

మీకోసం పోరాటం’ పేరుతో 49 అంశాలతో ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన ట్రంప్

 అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ నుంచి అధికారికంగా నామినేషన్ స్వీకరించిన అనంతరం వైట్‌హౌస్‌లో ట్రంప్ దాదాపు 70 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘మీ కోసం పోరాటం’ పేరుతో 49 అంశాలతో కూడిన ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. గత నాలుగేళ్లలో తాను చేసిన అభివృద్ధి గురించి, తిరిగి అధికారంలోకి వస్తే వచ్చే నాలుగేళ్లలో తాను ఏం చేయబోయేది వివరించారు. అమెరికాను మరోమారు సూపర్ పవర్‌గా నిలబెట్టడమే తన లక్ష్యమన్నారు.


చైనాకు తరలిపోయిన కంపెనీలు, ఉద్యోగాలను తిరిగి రప్పిస్తామన్నారు. చంద్రుడిపైకి మహిళను పంపడంతోపాటు అంగారకుడిపై అమెరికా జెండా ఎగురవేస్తామన్నారు.  చైనాపై ఆధారపడడాన్ని తగ్గిస్తామన్నారు. అమెరికా చరిత్రలోనే లేని విధంగా ఘనమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తామన్నారు.

ప్రస్తుత అధ్యక్ష ఎన్నికలు అమెరికా కలలు, అరాచకవాదానికి మధ్య జరుగుతున్న పోరుగా ట్రంప్ అభివర్ణించారు. అమెరికాకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదని ట్రంప్ పేర్కొన్నారు. మనకు సాధ్యం కానిది ఏదీ లేదని ప్రపంచానికి చాటి చెబుతానన్నారు. అమెరికన్ జీవన విధానాన్ని కాపాడుకోవాలా? లేక విధ్వంసం సృష్టించే రాడికల్ ఉద్యమాలకు అనుమతి ఇవ్వాలా? తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రత్యర్థి జో బైడెన్‌పైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన అమెరికా వారసత్వ విధ్వంసకుడని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఉద్యోగాలు విదేశాలకు తరలిపోవడంలో ఆయన పాత్ర ఉందన్నారు. ఉద్యమాల పేరుతో డెమోక్రాట్లు దేశాన్ని ముక్కలు చేస్తున్నారని ఆరోపించారు. సామ్యవాదానికి బైడెన్ గెలుపు గుర్రంలా మారారని విమర్శించారు. కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నామని పేర్కొన్న ట్రంప్.. కరోనా వైరస్‌కు చైనాదే పూర్తి బాధ్యత అని పునరుద్ఘాటించారు.  

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...