Skip to main content

మీకోసం పోరాటం’ పేరుతో 49 అంశాలతో ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన ట్రంప్

 అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ నుంచి అధికారికంగా నామినేషన్ స్వీకరించిన అనంతరం వైట్‌హౌస్‌లో ట్రంప్ దాదాపు 70 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘మీ కోసం పోరాటం’ పేరుతో 49 అంశాలతో కూడిన ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. గత నాలుగేళ్లలో తాను చేసిన అభివృద్ధి గురించి, తిరిగి అధికారంలోకి వస్తే వచ్చే నాలుగేళ్లలో తాను ఏం చేయబోయేది వివరించారు. అమెరికాను మరోమారు సూపర్ పవర్‌గా నిలబెట్టడమే తన లక్ష్యమన్నారు.


చైనాకు తరలిపోయిన కంపెనీలు, ఉద్యోగాలను తిరిగి రప్పిస్తామన్నారు. చంద్రుడిపైకి మహిళను పంపడంతోపాటు అంగారకుడిపై అమెరికా జెండా ఎగురవేస్తామన్నారు.  చైనాపై ఆధారపడడాన్ని తగ్గిస్తామన్నారు. అమెరికా చరిత్రలోనే లేని విధంగా ఘనమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తామన్నారు.

ప్రస్తుత అధ్యక్ష ఎన్నికలు అమెరికా కలలు, అరాచకవాదానికి మధ్య జరుగుతున్న పోరుగా ట్రంప్ అభివర్ణించారు. అమెరికాకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదని ట్రంప్ పేర్కొన్నారు. మనకు సాధ్యం కానిది ఏదీ లేదని ప్రపంచానికి చాటి చెబుతానన్నారు. అమెరికన్ జీవన విధానాన్ని కాపాడుకోవాలా? లేక విధ్వంసం సృష్టించే రాడికల్ ఉద్యమాలకు అనుమతి ఇవ్వాలా? తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రత్యర్థి జో బైడెన్‌పైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన అమెరికా వారసత్వ విధ్వంసకుడని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఉద్యోగాలు విదేశాలకు తరలిపోవడంలో ఆయన పాత్ర ఉందన్నారు. ఉద్యమాల పేరుతో డెమోక్రాట్లు దేశాన్ని ముక్కలు చేస్తున్నారని ఆరోపించారు. సామ్యవాదానికి బైడెన్ గెలుపు గుర్రంలా మారారని విమర్శించారు. కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నామని పేర్కొన్న ట్రంప్.. కరోనా వైరస్‌కు చైనాదే పూర్తి బాధ్యత అని పునరుద్ఘాటించారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.