Skip to main content

పెండింగ్ లో ఉన్న బీఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్లకు సుప్రీంకోర్ట్

 

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆటోమొబైల్ డీలర్లకు శుభవార్త చెప్పింది. పెండింగ్ లో ఉన్న బీఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్ కు అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. మార్చిలో విక్రయించినా, ఇప్పటికీ రిజిస్ట్రేషన్ కు నోచుకోని బీఎస్4 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని న్యాయస్థానం వెల్లడించింది. మార్చి 12 నుంచి మార్చి 31 మధ్య కాలంలో దేశంలో 9,56,015 వాహనాలు అమ్ముడవగా, వాటిలో రిజిస్ట్రేషన్ పూర్తయినవి 9,01,223 మాత్రమే.

కేంద్రం సరికొత్త బీఎస్6 ఉద్గార ప్రమాణాలు అమలు చేయాలని సంకల్పించడంతో బీఎస్4 వాహనాల అమ్మకాలను మార్చి 31తో నిలిపివేశారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో తాము బీఎస్4 వాహనాలను విక్రయించలేకపోయామని, తమ వద్ద మిగిలివున్న వాహనాలను అమ్ముకునేందుకు అనుమతించాలని ఆటోమొబైల్ వర్గాలు సుప్రీంను ఆశ్రయించాయి. దాంతో 10 రోజుల్లో 10 శాతం వాహనాలు మాత్రమే విక్రయించాలని సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది.

కానీ, ఆటోమొబైల్ డీలర్లు ఆ కాస్త గడువులో 10 శాతం కంటే మించి వాహనాలు విక్రయించడంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కారణంగా బీఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్ ముందుకు కదల్లేదు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ఆటోమొబైల్ డీలర్లకు ఊరట కలగనుంది.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.