Skip to main content

ఈ నెల 31 తర్వాత సమీక్ష జరిపి స్కూళ్ల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటాం: ఏపీ మంత్రి సురేశ్



 కరోనా కారణంగా విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కరోనా ప్రభావంతో పిల్లలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. పలు ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్ లైన్ లో క్లాసులను ప్రారంభించినప్పటికీ... ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం క్లాసులు ప్రారంభం కాలేదు. వచ్చే నెల 5వ తేదీన పాఠశాలలను ప్రారంభిస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు కావాల్సిన పాఠ్యపుస్తకాలను, యూనిఫాంలను అధికారులు సిద్దం చేశారు.


ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడుతూ... సెప్టెంబర్ 5న పాఠశాలలు ప్రారంభమవుతాయని జగన్ చెప్పారని... లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ఈనెల 31వ తేదీ వరకు పాఠశాలలను ప్రారంభించకూడదనే కేంద్ర ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఈ నెల 31 తర్వాత కరోనా పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీన గురుపూజోత్సవం సందర్భంగా నాడు-నేడు పనులను పూర్తి చేసి స్కూళ్లను ప్రారంభించాలనేది తమ ఆలోచన అని చెప్పారు. అయితే, 31వ తేదీన పరిస్థితిని సమీక్షిస్తామని మంత్రి చెప్పడంతో... కరోనా నియంత్రణలోకి రాని పక్షంలో స్కూళ్లు ప్రారంభం కాకపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...