పక్షి కోసం రూ.2 కోట్ల కారును పక్కన పెట్టేశాడు.. పక్షి కట్టుకున్న గూడే కదా అని దాన్ని తీయలేదు దుబాయ్ యువరాజు.. వివరాలు చూస్తే ఓ పక్షి కోసం రూ.2 కోట్ల విలువైన కారును వాడకుండా పక్కన పెట్టారు దుబాయ్ యువరాజు షేక్ రషీద్ అల్ మఖ్దూం. ఇటీవల రూ.2 కోట్ల ఖరీదైన తన మెర్సిడెస్ AMG G63 కారుపై ఓ పక్షి గూడు కట్టుకుని పొదగడం ప్రారంభించింది. దానికి హాని కల్గించడం ఇష్టం లేక కారును వాడకుండా పక్కన పెట్టేశాడు. పక్షి ఆటంకం కల్గించకుండా ఆ ప్రదేశానికి దూరంగా ఉండాలని తన సిబ్బందిని ఆదేశించాడు. యువరాజు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

Comments
Post a Comment