పక్షి కోసం రూ.2 కోట్ల కారును పక్కన పెట్టేశాడు.. పక్షి కట్టుకున్న గూడే కదా అని దాన్ని తీయలేదు దుబాయ్ యువరాజు.. వివరాలు చూస్తే ఓ పక్షి కోసం రూ.2 కోట్ల విలువైన కారును వాడకుండా పక్కన పెట్టారు దుబాయ్ యువరాజు షేక్ రషీద్ అల్ మఖ్దూం. ఇటీవల రూ.2 కోట్ల ఖరీదైన తన మెర్సిడెస్ AMG G63 కారుపై ఓ పక్షి గూడు కట్టుకుని పొదగడం ప్రారంభించింది. దానికి హాని కల్గించడం ఇష్టం లేక కారును వాడకుండా పక్కన పెట్టేశాడు. పక్షి ఆటంకం కల్గించకుండా ఆ ప్రదేశానికి దూరంగా ఉండాలని తన సిబ్బందిని ఆదేశించాడు. యువరాజు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు
కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్ పిటిషన్లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.
Comments
Post a Comment