Skip to main content

సుశాంత్ సింగ్ పై అభిమానం... 'సడక్-2'పై ఆగ్రహమైంది!

 


సంజయ్ దత్, ఆలియా భట్ ప్రధాన పాత్రలు పోషించగా, ఆలియా తండ్రి మహేశ్ భట్ నిర్మించిన 'సడక్-2' ట్రయిలర్ ఇప్పుడు అత్యంత చెత్త రికార్డులను క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ట్రయిలర్ విడుదల కాగానే, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పై ఉన్న అభిమానం, ఈ ట్రయిల్ పట్ల శాపమైంది. 


బాలీవుడ్ లో బంధుప్రీతి కారణంగానే సుశాంత్ సూసైడ్ చేసుకున్నారన్న ఆరోపణలు, గతంలో మహేశ్ భట్, సుశాంత్ కు అన్యాయం చేశారన్న పుకార్ల నేపథ్యంలో, ఈ వీడియోకు అత్యధిక డిస్ లైక్స్ రావడం గమనార్హం.

ఇక ఈ సినిమా ట్రయిలర్ కింద సుశాంత్ కు న్యాయం జరగాల్సిందేనంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ ట్రయిలర్ కు ఏకంగా 30 లక్షలకు పైగా డిస్ లైక్స్ వచ్చాయి. ప్రపంచంలోనే అత్యధిక డిస్ లైక్ లు వచ్చిన ట్రయిలర్ గా ఇది నిలుస్తుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...