Skip to main content

మోదీ శపథం.. 28 ఏళ్ల తర్వాత తొలిసారి



ప్రధాని మోదీ ఈ నెల 5న అయోధ్యలో రామమందిరానికి శంకుస్థాపన చేయనుండగా.. దాదాపు 28 ఏళ్ల తర్వాత మోదీ అయోధ్యకు వస్తుండటం గమనార్హం. అయోధ్యలో రామాలయం నిర్మించండి కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయాలని మోదీ 1992లో అయోధ్యలో తిరంగా యాత్ర చేపట్టారు. అప్పటి లో ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ బహిరంగసభలో పాల్గొన్న మోడీ ఆ మరుసటి రోజున అప్పటి బీజేపీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషితో కలిసి అయోధ్య వెళ్లి, అక్కడ స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించారు. అయోధ్యలో రామ్ జన్మభూమిలో రామాలయం నిర్మాణం జరిగే రోజున తిరిగి అయోధ్యలో అడుగుపెడతానని, అప్పటి వరకు అయోధ్యలో అడుగుపెట్టనని చెప్పారు. 28 ఏళ్ల తరువాత ఆ కల నెరవేరబోతున్నది. మళ్లీ అయోధ్యకు వస్తే మందిర నిర్మాణం జరిగాకే వస్తానని మోదీ అప్పట్లో శపథం చేయగా..అయోధ్య రామ్ జన్మభూమిలో రామాలయం నిర్మాణం కోసం భూమి పూజను చేయబోతున్నారు. ఈ విధంగా మోడీ రెండోసారి అయోధ్యకు వస్తున్నారు. నాడు ఆయన పర్యటించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి

Comments

Popular posts from this blog

బలపరీక్ష ఎప్పుడు నిర్వహించినా సిద్ధం.. తమ ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఆ పార్టీల అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ ఏ రోజు జరిగినా దానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. ముంబయిలోని పోవైలో ఉన్న ఓ హోటల్ కు నిన్న రాత్రే ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో చేరుకున్నారు. శివసేన నుంచి 56 మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. వారిలో 55 మంది  అధేరీలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అలాగే, వారి నుంచి ఆ పార్టీ అధిష్ఠానం సెల్ ఫోన్ లను తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ 44 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్ కి తరలించింది. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పటేల్ మీడియాకు చెప్పారు. 

రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారయ్యిందన్నట్లు మాట్లాడి ఓ బీజేపీ ఎమ్మెల్యే సంచలనానికి తెరతీశారు. నవంబరు 18వ తేదీన నిర్మాణం ప్రారంభమవుతుందంటూ డేట్‌ కూడా ఫిక్స్‌ చేసేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో వుంది. రామాలయ నిర్మాణం విషయంలో శుభవార్త వింటారని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ రెండు రోజుల క్రితమే వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...రాజస్థాన్‌ రాష్ట్రం పాలి జిల్లా కేంద్రంలో జరిగిన రాంలీలా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గైన్‌చంద్‌ పరఖ్‌ మాట్లాడారు. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న రామజన్మభూమి కేసు నవంబరు 17వ తేదీ నాటికి కొలిక్కి వస్తుందని, 18వ తేదీన రామమందిర నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.