Skip to main content

మోదీ శపథం.. 28 ఏళ్ల తర్వాత తొలిసారి



ప్రధాని మోదీ ఈ నెల 5న అయోధ్యలో రామమందిరానికి శంకుస్థాపన చేయనుండగా.. దాదాపు 28 ఏళ్ల తర్వాత మోదీ అయోధ్యకు వస్తుండటం గమనార్హం. అయోధ్యలో రామాలయం నిర్మించండి కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయాలని మోదీ 1992లో అయోధ్యలో తిరంగా యాత్ర చేపట్టారు. అప్పటి లో ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ బహిరంగసభలో పాల్గొన్న మోడీ ఆ మరుసటి రోజున అప్పటి బీజేపీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషితో కలిసి అయోధ్య వెళ్లి, అక్కడ స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించారు. అయోధ్యలో రామ్ జన్మభూమిలో రామాలయం నిర్మాణం జరిగే రోజున తిరిగి అయోధ్యలో అడుగుపెడతానని, అప్పటి వరకు అయోధ్యలో అడుగుపెట్టనని చెప్పారు. 28 ఏళ్ల తరువాత ఆ కల నెరవేరబోతున్నది. మళ్లీ అయోధ్యకు వస్తే మందిర నిర్మాణం జరిగాకే వస్తానని మోదీ అప్పట్లో శపథం చేయగా..అయోధ్య రామ్ జన్మభూమిలో రామాలయం నిర్మాణం కోసం భూమి పూజను చేయబోతున్నారు. ఈ విధంగా మోడీ రెండోసారి అయోధ్యకు వస్తున్నారు. నాడు ఆయన పర్యటించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.