Skip to main content

మోదీ శపథం.. 28 ఏళ్ల తర్వాత తొలిసారి



ప్రధాని మోదీ ఈ నెల 5న అయోధ్యలో రామమందిరానికి శంకుస్థాపన చేయనుండగా.. దాదాపు 28 ఏళ్ల తర్వాత మోదీ అయోధ్యకు వస్తుండటం గమనార్హం. అయోధ్యలో రామాలయం నిర్మించండి కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయాలని మోదీ 1992లో అయోధ్యలో తిరంగా యాత్ర చేపట్టారు. అప్పటి లో ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ బహిరంగసభలో పాల్గొన్న మోడీ ఆ మరుసటి రోజున అప్పటి బీజేపీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషితో కలిసి అయోధ్య వెళ్లి, అక్కడ స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించారు. అయోధ్యలో రామ్ జన్మభూమిలో రామాలయం నిర్మాణం జరిగే రోజున తిరిగి అయోధ్యలో అడుగుపెడతానని, అప్పటి వరకు అయోధ్యలో అడుగుపెట్టనని చెప్పారు. 28 ఏళ్ల తరువాత ఆ కల నెరవేరబోతున్నది. మళ్లీ అయోధ్యకు వస్తే మందిర నిర్మాణం జరిగాకే వస్తానని మోదీ అప్పట్లో శపథం చేయగా..అయోధ్య రామ్ జన్మభూమిలో రామాలయం నిర్మాణం కోసం భూమి పూజను చేయబోతున్నారు. ఈ విధంగా మోడీ రెండోసారి అయోధ్యకు వస్తున్నారు. నాడు ఆయన పర్యటించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...