Skip to main content

చైనాపై గూగుల్ ఉక్కుపాదం: 2500 ఛానళ్లు తొలగింపు


కరోనా మహమ్మారికి చైనా అడ్డుకట్ట వేయకపోవడం, ప్రపంచంలో కరోనా మహమ్మారి వ్యాప్తికి చైనా కారణం కావడంతో అమెరికాతో అనేక దేశాలు చైనాను విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ విమర్శలను పక్కదోవ పట్టించేందుకు చైనా, ఇండియా బోర్డర్ లో అలజడులు సృష్టించింది.  దీంతో ఇండియా ఆ దేశానికీ చెందిన ఆర్ధిక వ్యవస్థపై దెబ్బకొట్టాలని చూసింది.  ఇందులో భాగంగానే ఒకసారి 59, మరోసారి 47 చైనా యాప్స్ పై నిషేధం విధించింది.  మరో 250 యాప్స్ ను మానిటరింగ్ చేస్తున్నది ప్రభుత్వం.  

ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు గూగుల్ సైతం చైనాపై ఉక్కుపాదం మోపింది.  ఆ దేశానికీ చెందిన 2500 యూట్యూబ్ ఛానల్స్ ను తొలగించినట్టు ప్రకటించింది.  త్రైమాసిక బులెటిన్ ను గూగుల్ ఈ విషయాన్ని పేర్కొన్నది.  స్పామ్, వివాదాస్పద కంటెంట్ ను ఆయా ఛానల్స్ యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నాయని తెలిపింది.  దీంతో ఆయా ఛానల్స్ ను తొలగించినట్టు గూగుల్ పేర్కొన్నది.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...