Skip to main content

225కే క‌రోనా వ్యాక్సిన్‌...ఎందుకు ఈ ధ‌ర‌లో ఇస్తున్నారో తెలుసా?

 .

యూనివర్సిటీ ముందంజలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు త‌యారు చేసిన టీకా ట్ర‌య‌ల్స్‌లో సత్ఫ‌లితాల‌ను ఇస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌లు ఎంద‌రిలోనో ఆశ‌లు పుట్టించాయి. అయితే ఈ టీకా బ‌య‌టికి వ‌స్తే ధ‌ర చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న త‌రుణంలో కీల‌క గుడ్ న్యూస్ వెలుగులోకి వ‌చ్చింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తయారు చేసిన క‌రోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయ‌నుంది. మ‌న దేశానికి చెందిన ఈ సంస్థ నేడు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త‌ దేశంలో కరోనా వ్యాక్సిన్‌ను రూ.225కే అందించ‌నున్న‌ట్లు సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ వెల్ల‌డించింది.




ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు రెండు కలిసి క‌రోనా వ్యాక్సిన్‌ను తయారు చేశాయి. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి భార‌త్‌కు చెందిన ఫార్మా కంపెనీ  సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభంలో 100 మిలియ‌న్‌ డోసుల‌ను ఉత్ప‌త్తి చేసి భారత్‌తోపాటు ఇతర దేశాలకు అందించ‌నుంది.  క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత ప్రజల కోసం కరోనా వ్యాక్సిన్‌ ఒక్క డోసును కేవలం రూ.225కే విక్రయిస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది.





కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే ఒక్క వ్యాక్సిన్ వల్లనే సాధ్యమవుతుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. వ్యాక్సిన్ తయారుదిశగా పలు దేశాలు విశేషంగా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్-19 కు వ్యాక్సిన్ తేవడంలో విశేషంగా కృషి చేస్తోంది సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్. ఈ సంస్థ య‌జ‌మానులు కోటిశ్వరులైనప్పటికీ ఎలాంటి బేషజాలు లేకుండా సమాజం అభివృద్ధే లక్ష్యంగా పాటుపడుతున్నారు. అందుకే ఇంత త‌క్కువ ధ‌ర‌లో, రూ.225కు క‌రోనా వ్యాక్సిన్ టీకాను అందిస్తున్నారు.]]>

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.