Skip to main content

225కే క‌రోనా వ్యాక్సిన్‌...ఎందుకు ఈ ధ‌ర‌లో ఇస్తున్నారో తెలుసా?

 .

యూనివర్సిటీ ముందంజలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు త‌యారు చేసిన టీకా ట్ర‌య‌ల్స్‌లో సత్ఫ‌లితాల‌ను ఇస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌లు ఎంద‌రిలోనో ఆశ‌లు పుట్టించాయి. అయితే ఈ టీకా బ‌య‌టికి వ‌స్తే ధ‌ర చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న త‌రుణంలో కీల‌క గుడ్ న్యూస్ వెలుగులోకి వ‌చ్చింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తయారు చేసిన క‌రోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయ‌నుంది. మ‌న దేశానికి చెందిన ఈ సంస్థ నేడు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త‌ దేశంలో కరోనా వ్యాక్సిన్‌ను రూ.225కే అందించ‌నున్న‌ట్లు సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ వెల్ల‌డించింది.




ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు రెండు కలిసి క‌రోనా వ్యాక్సిన్‌ను తయారు చేశాయి. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి భార‌త్‌కు చెందిన ఫార్మా కంపెనీ  సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభంలో 100 మిలియ‌న్‌ డోసుల‌ను ఉత్ప‌త్తి చేసి భారత్‌తోపాటు ఇతర దేశాలకు అందించ‌నుంది.  క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత ప్రజల కోసం కరోనా వ్యాక్సిన్‌ ఒక్క డోసును కేవలం రూ.225కే విక్రయిస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది.





కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే ఒక్క వ్యాక్సిన్ వల్లనే సాధ్యమవుతుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. వ్యాక్సిన్ తయారుదిశగా పలు దేశాలు విశేషంగా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్-19 కు వ్యాక్సిన్ తేవడంలో విశేషంగా కృషి చేస్తోంది సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్. ఈ సంస్థ య‌జ‌మానులు కోటిశ్వరులైనప్పటికీ ఎలాంటి బేషజాలు లేకుండా సమాజం అభివృద్ధే లక్ష్యంగా పాటుపడుతున్నారు. అందుకే ఇంత త‌క్కువ ధ‌ర‌లో, రూ.225కు క‌రోనా వ్యాక్సిన్ టీకాను అందిస్తున్నారు.]]>

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...