Skip to main content

225కే క‌రోనా వ్యాక్సిన్‌...ఎందుకు ఈ ధ‌ర‌లో ఇస్తున్నారో తెలుసా?

 .

యూనివర్సిటీ ముందంజలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు త‌యారు చేసిన టీకా ట్ర‌య‌ల్స్‌లో సత్ఫ‌లితాల‌ను ఇస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌లు ఎంద‌రిలోనో ఆశ‌లు పుట్టించాయి. అయితే ఈ టీకా బ‌య‌టికి వ‌స్తే ధ‌ర చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న త‌రుణంలో కీల‌క గుడ్ న్యూస్ వెలుగులోకి వ‌చ్చింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తయారు చేసిన క‌రోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయ‌నుంది. మ‌న దేశానికి చెందిన ఈ సంస్థ నేడు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త‌ దేశంలో కరోనా వ్యాక్సిన్‌ను రూ.225కే అందించ‌నున్న‌ట్లు సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ వెల్ల‌డించింది.




ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు రెండు కలిసి క‌రోనా వ్యాక్సిన్‌ను తయారు చేశాయి. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి భార‌త్‌కు చెందిన ఫార్మా కంపెనీ  సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభంలో 100 మిలియ‌న్‌ డోసుల‌ను ఉత్ప‌త్తి చేసి భారత్‌తోపాటు ఇతర దేశాలకు అందించ‌నుంది.  క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత ప్రజల కోసం కరోనా వ్యాక్సిన్‌ ఒక్క డోసును కేవలం రూ.225కే విక్రయిస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది.





కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే ఒక్క వ్యాక్సిన్ వల్లనే సాధ్యమవుతుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. వ్యాక్సిన్ తయారుదిశగా పలు దేశాలు విశేషంగా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్-19 కు వ్యాక్సిన్ తేవడంలో విశేషంగా కృషి చేస్తోంది సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్. ఈ సంస్థ య‌జ‌మానులు కోటిశ్వరులైనప్పటికీ ఎలాంటి బేషజాలు లేకుండా సమాజం అభివృద్ధే లక్ష్యంగా పాటుపడుతున్నారు. అందుకే ఇంత త‌క్కువ ధ‌ర‌లో, రూ.225కు క‌రోనా వ్యాక్సిన్ టీకాను అందిస్తున్నారు.]]>

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...