నాగార్జు సాగర్ కు శ్రీ శైలంనుంచి భారీగా ఇన్ ఫ్లో వస్తుండడంతో శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టు18 గేట్లను ఎత్తారు. 27 రోజులుగా శ్రీశైలం నుంచి నిలకడగా ఇన్ఫ్లో వస్తుండడంతో నాగార్జున సాగర్లో నీటిమట్టం 578 అడుగులకు చేరుకుంది.శుక్రవారం ఉదయం మొదట నాలుగుగేట్లు ఎత్తారు. సాయంత్రానికి ఇన్ఫ్లో 4లక్షల క్యూసెక్కులకు పెరగడంతో18 గేట్లను ఎత్తి 1,38,240 క్యూసెక్కులు,ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా మరో 24,360 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్లో నీటిసామర్థ్యం 312టీఎంసీలకుగాను 300టీఎంసీలకు చేరుకుంది.
వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్పైవెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్కు దారి ఇచ్చింది.
Comments
Post a Comment