నాగార్జు సాగర్ కు శ్రీ శైలంనుంచి భారీగా ఇన్ ఫ్లో వస్తుండడంతో శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టు18 గేట్లను ఎత్తారు. 27 రోజులుగా శ్రీశైలం నుంచి నిలకడగా ఇన్ఫ్లో వస్తుండడంతో నాగార్జున సాగర్లో నీటిమట్టం 578 అడుగులకు చేరుకుంది.శుక్రవారం ఉదయం మొదట నాలుగుగేట్లు ఎత్తారు. సాయంత్రానికి ఇన్ఫ్లో 4లక్షల క్యూసెక్కులకు పెరగడంతో18 గేట్లను ఎత్తి 1,38,240 క్యూసెక్కులు,ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా మరో 24,360 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్లో నీటిసామర్థ్యం 312టీఎంసీలకుగాను 300టీఎంసీలకు చేరుకుంది.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments
Post a Comment