నాగార్జు సాగర్ కు శ్రీ శైలంనుంచి భారీగా ఇన్ ఫ్లో వస్తుండడంతో శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టు18 గేట్లను ఎత్తారు. 27 రోజులుగా శ్రీశైలం నుంచి నిలకడగా ఇన్ఫ్లో వస్తుండడంతో నాగార్జున సాగర్లో నీటిమట్టం 578 అడుగులకు చేరుకుంది.శుక్రవారం ఉదయం మొదట నాలుగుగేట్లు ఎత్తారు. సాయంత్రానికి ఇన్ఫ్లో 4లక్షల క్యూసెక్కులకు పెరగడంతో18 గేట్లను ఎత్తి 1,38,240 క్యూసెక్కులు,ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా మరో 24,360 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్లో నీటిసామర్థ్యం 312టీఎంసీలకుగాను 300టీఎంసీలకు చేరుకుంది.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

Comments
Post a Comment