Skip to main content

బెజవాడకు మరో మణిహారం - ఇంజనీరింగ్ అద్భుతం కనకదుర్గ ప్లే ఓవర్ పూర్తి- ఆగస్టు 15న ప్రారంభం..

 

ఏపీలో ఆర్ధిక రాజధానిగా ఉన్న విజయవాడ నగరానికి మరో మణిహారంగా రూపుదిద్దుకుంటున్న కనకదుర్గ ఫ్లైవర్ నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభమైనా ఎన్నో ఆడ్డంకులు, నిధుల సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు దాటుకుంటూ తాజాగా నిర్మాణం పూర్తి చేసుకుంది. దీంతో ఆగస్టు 15న దీన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంజనీరింగ్ అద్భుతంగానూ, అత్యంత పొడవైన నిర్మాణంతో పాటు మరెన్నో ఘనతలు సొంతం చేసుకున్న ఈ ఫ్రైఓవర్‌ గురించి ప్ర్తత్యేక కథనం..

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.