Skip to main content

అన్న స్థానంలో ఉద్యోగం చేస్తోన్న తమ్ముడు.. ఒకేలా ఉండడంతో 12 ఏళ్లుగా గుర్తు పట్టని వైనం

 వారిద్దరు కవలలు.. అచ్చం ఒకేలా ఉంటారు.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏకంగా 12 ఏళ్లుగా అన్న ఉద్యోగాన్ని తమ్ముడు చేస్తున్నాడు. చివరకు ఈ విషయాన్ని గుర్తించిన ఓ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సినిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతంలోని చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన గాదె రాందాస్‌, గాదె రవీందర్‌ సోదరులు. అప్పట్లో గాదె రాందాస్‌ కు టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌లో జూనియర్‌ లైన్‌మన్‌గా ఉద్యోగం రాగా, అతడి పేరుతో తమ్ముడు గాదె రవీందర్‌ ఉద్యోగంలో చేరాడు.

అనంతరం క్రమంగా లైన్‌మన్‌గా పదోన్నతి పొందాడు. వారి బాగోతాన్ని గుర్తించిన ఓ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. రాందాస్‌ పేరుతో రవీందర్‌ ఉద్యోగం చేస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులు నిర్ధారణ చేసుకున్నారు. దీంతో రవీందర్‌ను ఉద్యోగం నుంచి తొలగించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.