Skip to main content

అన్న స్థానంలో ఉద్యోగం చేస్తోన్న తమ్ముడు.. ఒకేలా ఉండడంతో 12 ఏళ్లుగా గుర్తు పట్టని వైనం

 వారిద్దరు కవలలు.. అచ్చం ఒకేలా ఉంటారు.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏకంగా 12 ఏళ్లుగా అన్న ఉద్యోగాన్ని తమ్ముడు చేస్తున్నాడు. చివరకు ఈ విషయాన్ని గుర్తించిన ఓ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సినిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతంలోని చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన గాదె రాందాస్‌, గాదె రవీందర్‌ సోదరులు. అప్పట్లో గాదె రాందాస్‌ కు టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌లో జూనియర్‌ లైన్‌మన్‌గా ఉద్యోగం రాగా, అతడి పేరుతో తమ్ముడు గాదె రవీందర్‌ ఉద్యోగంలో చేరాడు.

అనంతరం క్రమంగా లైన్‌మన్‌గా పదోన్నతి పొందాడు. వారి బాగోతాన్ని గుర్తించిన ఓ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. రాందాస్‌ పేరుతో రవీందర్‌ ఉద్యోగం చేస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులు నిర్ధారణ చేసుకున్నారు. దీంతో రవీందర్‌ను ఉద్యోగం నుంచి తొలగించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...