Skip to main content

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేపై మరింత ఆసక్తిని పెంచేసిన నిర్వాహకులు.. సర్ ప్రైజ్ కు సిద్ధమా?


తెలుగు బిగ్ బాస్ 3 చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే.  గ్రాండ్ ఫినాలే మరింత ఆసక్తికరంగా మారనుంది. హీరోయిన్లు అంజలి, నిధి అగర్వాల్, క్యాథరిన్ తో పాటు పలువురు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. ఆ షో నిర్వాహకులు విడుదల చేసిన ఓ ప్రోమోను చూస్తే బుల్లితెర యాంకర్లు కూడా గ్రాండ్ ఫినాలేకు వస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ షోకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన సినీనటుడు శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను షూటింగ్‌ అయినా మానేస్తా కానీ బిగ్‌బాస్‌ మాత్రం మాననని అన్నాడు. గ్రాండ్ ఫినాలేలో సెలబ్రిటీల హంగామాతో మామూలుగా ఉండదని తెలుస్తోంది.

బిగ్ బాస్ 3లో గెలుపొందే అవకాశాలు వరుణ్ సందేశ్, రాహుల్ కే అధికంగా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సీజన్ విజేత ఎవరో చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. టైటిల్ పోరులో బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, అలీ, శ్రీముఖి నిలిచారు. వీరిలో విజేతగా నిలిచే వారు రూ.50 లక్షలు గెలుచుకుంటారు.

దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం జరిగే గ్రాండ్‌ ఫినాలే కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'గ్రాండ్ ఫినాలె చూడడానికి సిద్ధమా? ఈ రోజు సాయంత్రం మరింత సర్ ప్రైజ్..  మరింత ఫన్' అంటూ స్టార్ మా ట్వీట్ చేసింది.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...