Skip to main content

రాజధాని నిర్మాణ పనుల్లో రివర్స్ టెండరింగ్: సీఎం జగన్



ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం సానుకూల ధోరణి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. సీఆర్డీఏపై సమీక్ష జరిపిన సీఎం జగన్ రాజధాని నిర్మాణ పనుల కొనసాగింపునకు నిర్ణయం తీసుకోవడమే అందుకు నిదర్శనం. రాజధానిలో నిర్మాణంలో ఉన్న పనుల కొనసాగింపునకు పచ్చజెండా ఊపారు. రాజధాని పరిధిలో ప్రాధాన్యతల పరంగా నిర్మాణ పనులు కొనసాగించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు తగ్గట్టుగా పనులు ఉండాలని సీఎం సూచించారు. సీఆర్డీఏ పరిధిలో ఎక్కడా ప్లానింగ్ లో పొరబాట్లు ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు.

ఇక్కడ కూడా ఖజానాపై భారం తగ్గించుకోవడానికి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. భూములిచ్చిన రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి అప్పగించాలని భావిస్తున్నారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిపోయిన భూమిని బ్యూటిఫికేషన్ చేయాలని సూచించారు. నిలిచిపోయిన నిర్మాణ పనులకు నిధులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ పనుల్లోనూ రివర్స్ టెండరింగ్ కు వెళతామని వెల్లడించారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.