Skip to main content

రాజధాని నిర్మాణ పనుల్లో రివర్స్ టెండరింగ్: సీఎం జగన్



ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం సానుకూల ధోరణి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. సీఆర్డీఏపై సమీక్ష జరిపిన సీఎం జగన్ రాజధాని నిర్మాణ పనుల కొనసాగింపునకు నిర్ణయం తీసుకోవడమే అందుకు నిదర్శనం. రాజధానిలో నిర్మాణంలో ఉన్న పనుల కొనసాగింపునకు పచ్చజెండా ఊపారు. రాజధాని పరిధిలో ప్రాధాన్యతల పరంగా నిర్మాణ పనులు కొనసాగించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు తగ్గట్టుగా పనులు ఉండాలని సీఎం సూచించారు. సీఆర్డీఏ పరిధిలో ఎక్కడా ప్లానింగ్ లో పొరబాట్లు ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు.

ఇక్కడ కూడా ఖజానాపై భారం తగ్గించుకోవడానికి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. భూములిచ్చిన రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి అప్పగించాలని భావిస్తున్నారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిపోయిన భూమిని బ్యూటిఫికేషన్ చేయాలని సూచించారు. నిలిచిపోయిన నిర్మాణ పనులకు నిధులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ పనుల్లోనూ రివర్స్ టెండరింగ్ కు వెళతామని వెల్లడించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...