Skip to main content

రాజధాని నిర్మాణ పనుల్లో రివర్స్ టెండరింగ్: సీఎం జగన్



ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం సానుకూల ధోరణి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. సీఆర్డీఏపై సమీక్ష జరిపిన సీఎం జగన్ రాజధాని నిర్మాణ పనుల కొనసాగింపునకు నిర్ణయం తీసుకోవడమే అందుకు నిదర్శనం. రాజధానిలో నిర్మాణంలో ఉన్న పనుల కొనసాగింపునకు పచ్చజెండా ఊపారు. రాజధాని పరిధిలో ప్రాధాన్యతల పరంగా నిర్మాణ పనులు కొనసాగించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు తగ్గట్టుగా పనులు ఉండాలని సీఎం సూచించారు. సీఆర్డీఏ పరిధిలో ఎక్కడా ప్లానింగ్ లో పొరబాట్లు ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు.

ఇక్కడ కూడా ఖజానాపై భారం తగ్గించుకోవడానికి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. భూములిచ్చిన రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి అప్పగించాలని భావిస్తున్నారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిపోయిన భూమిని బ్యూటిఫికేషన్ చేయాలని సూచించారు. నిలిచిపోయిన నిర్మాణ పనులకు నిధులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ పనుల్లోనూ రివర్స్ టెండరింగ్ కు వెళతామని వెల్లడించారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...