Skip to main content

డ్రీమ్‌ క్యాపిటల్‌ ఎక్కడ కట్టారో చెప్పాలి: బుగ్గన



రాజధాని పర్యటన సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఖండించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మట్లాడుతూ... చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ‘‘ డ్రీమ్‌ క్యాపిటల్‌ ఎక్కడ కట్టారో చంద్రబాబు చెప్పాలి? ప్రతిసారి ఆయన మాట మారుస్తున్నారు. తాత్కాలిక భవనాలని చంద్రబాబే చెప్పారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు శాశ్వత భవనాలు కడతామని మీరే చెప్పారు. మహిష్మతి కోసం రాజమౌళి సలహాలు తీసుకోవాలని అనుకున్నారు. ఎప్పుడో రాచరికం ఉన్నప్పుడు రాజధాని కేంద్రీకరణ జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా వికేంద్రీకరణ జరుగుతోంది. మహారాష్ట్రలో ముంబయి, తమిళనాడులో చెన్నై, కర్ణాటకలో బెంగళూరుతో పాటు అనేక రగాలు అభివృద్ధి చెందాయి. సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ నిజమే అయితే నెలకో నగరం కట్టొచ్చు. బ్యాంకులు, బాండ్ల ద్వారా రూ.5వేల కోట్లకుపైగా అప్పు తెచ్చారు. ఐదేళ్లపాటు అమరావతిని ఎందుకు నోటిఫై చేయలేదు?రాజధానిలో జరిగిన అన్ని అవినీతి పనులను బయటపెడతాం. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించేందుకు సమయం పడుతుంది. అమరావతిపై విచారణ చేయాల్సిన అవసరం లేదని మీరెలా చెబుతారు?’’ అని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...