Skip to main content

డ్రీమ్‌ క్యాపిటల్‌ ఎక్కడ కట్టారో చెప్పాలి: బుగ్గన



రాజధాని పర్యటన సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఖండించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మట్లాడుతూ... చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ‘‘ డ్రీమ్‌ క్యాపిటల్‌ ఎక్కడ కట్టారో చంద్రబాబు చెప్పాలి? ప్రతిసారి ఆయన మాట మారుస్తున్నారు. తాత్కాలిక భవనాలని చంద్రబాబే చెప్పారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు శాశ్వత భవనాలు కడతామని మీరే చెప్పారు. మహిష్మతి కోసం రాజమౌళి సలహాలు తీసుకోవాలని అనుకున్నారు. ఎప్పుడో రాచరికం ఉన్నప్పుడు రాజధాని కేంద్రీకరణ జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా వికేంద్రీకరణ జరుగుతోంది. మహారాష్ట్రలో ముంబయి, తమిళనాడులో చెన్నై, కర్ణాటకలో బెంగళూరుతో పాటు అనేక రగాలు అభివృద్ధి చెందాయి. సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ నిజమే అయితే నెలకో నగరం కట్టొచ్చు. బ్యాంకులు, బాండ్ల ద్వారా రూ.5వేల కోట్లకుపైగా అప్పు తెచ్చారు. ఐదేళ్లపాటు అమరావతిని ఎందుకు నోటిఫై చేయలేదు?రాజధానిలో జరిగిన అన్ని అవినీతి పనులను బయటపెడతాం. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించేందుకు సమయం పడుతుంది. అమరావతిపై విచారణ చేయాల్సిన అవసరం లేదని మీరెలా చెబుతారు?’’ అని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.