Skip to main content

డ్రీమ్‌ క్యాపిటల్‌ ఎక్కడ కట్టారో చెప్పాలి: బుగ్గన



రాజధాని పర్యటన సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఖండించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మట్లాడుతూ... చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ‘‘ డ్రీమ్‌ క్యాపిటల్‌ ఎక్కడ కట్టారో చంద్రబాబు చెప్పాలి? ప్రతిసారి ఆయన మాట మారుస్తున్నారు. తాత్కాలిక భవనాలని చంద్రబాబే చెప్పారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు శాశ్వత భవనాలు కడతామని మీరే చెప్పారు. మహిష్మతి కోసం రాజమౌళి సలహాలు తీసుకోవాలని అనుకున్నారు. ఎప్పుడో రాచరికం ఉన్నప్పుడు రాజధాని కేంద్రీకరణ జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా వికేంద్రీకరణ జరుగుతోంది. మహారాష్ట్రలో ముంబయి, తమిళనాడులో చెన్నై, కర్ణాటకలో బెంగళూరుతో పాటు అనేక రగాలు అభివృద్ధి చెందాయి. సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ నిజమే అయితే నెలకో నగరం కట్టొచ్చు. బ్యాంకులు, బాండ్ల ద్వారా రూ.5వేల కోట్లకుపైగా అప్పు తెచ్చారు. ఐదేళ్లపాటు అమరావతిని ఎందుకు నోటిఫై చేయలేదు?రాజధానిలో జరిగిన అన్ని అవినీతి పనులను బయటపెడతాం. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించేందుకు సమయం పడుతుంది. అమరావతిపై విచారణ చేయాల్సిన అవసరం లేదని మీరెలా చెబుతారు?’’ అని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...