Skip to main content

ఒక్క ఫొటో ఆ చిన్నారి జీవితాన్ని మార్చేసింది!

 


ఇటీవల సోషల్ మీడియాలో ఓ చిన్నారి ఖాళీ గిన్నె పట్టుకుని అతి దీనంగా ఓ క్లాస్ రూమ్ బయట నిలుచున్న ఫొటో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో... క్లాస్ రూమ్ లో తన ఈడు పిల్లలందరూ యూనిఫాం ధరించి చదువుకుంటూ ఉండగా, వారికి మధ్యాహ్న భోజనం పెట్టే వేళ తనకు కూడా ఇన్ని మెతుకులు వేయకపోతారా అని అత్యంత దయనీయ స్థితిలో ఆ బాలిక వేచిచూస్తుండడం చాలామందిని కలచివేసింది. ఇది ఓ జర్నలిస్ట్ తీసిన ఫొటో.

'ఆకలి చూపు' అనే టైటిల్ తో వచ్చిన ఈ ఫోటో చూసి వెంకట్ రెడ్డి అనే సామాజిక కార్యకర్త చలించిపోయారు. వెంటనే ఆ బాలిక అడ్రస్ కనుక్కుని వెళ్లి అక్కడి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ బాలిక పేరు మోతీ దివ్య. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఓ మురికివాడలో ఉండే ఆ బాలిక తల్లిదండ్రులు చెత్త ఏరుకుని బతికే  నిరుపేదలు. తల్లిదండ్రులు చెత్త ఏరుకోవడానికి వెళితే, ప్రతిరోజూ ఈ చిన్నారి స్కూలు వద్దకు వెళ్లి మధ్యాహ్న భోజనం కోసం అలమటించిపోయేది.

ఈ విషయం తెలుసుకున్న వెంకట్ రెడ్డి ఆమె తల్లిదండ్రులను ఒప్పించి తాను ఏ స్కూల్ వద్దనైతే భోజనం కోసం పడిగాపులు పడేదో అదే స్కూల్లో చేర్పించారు. ఇప్పుడు మోతి దివ్య అందరు విద్యార్ధుల్లా చక్కగా యూనిఫాం వేసుకుని స్కూల్ కు వెళుతోంది. దివ్యను చూడాలనుకుంటే గుడి మల్కాపూర్ లో ఉన్న దేవల్ ఝామ్ సింగ్ గవర్నమెంట్ హైస్కూల్ కు వెళితే సరి. అక్కడ అందరు పిల్లల్లా ఎంతో ఉత్సాహంగా, నవ్వుతూ, తుళ్లుతూ, హాయిగా చదువుకుంటూ కనిపిస్తుంది.

Comments

Popular posts from this blog

రేపు బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ రేపు దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు జగన్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. ఎల్లుండి ఆయన ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సీఎం అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలోని ఓంకారం వద్ద రాష్ట్ర మంత్రులు సీఎంకు స్వాగతం పలుకుతారు. ఆపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కాగా, సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో వీఐపీ క్యూలైన్లను నిలిపివేస్తారు. సాధారణ, రూ.100 క్యూలైన్లు మాత్రం నడుస్తాయి. ఇక జగన్ పర్యటన సందర్భంగా ఘాట్ రోడ్డుపైకి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించరు.

ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి రాదు: రేవంత్ రెడ్డి

  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంను కలిసి నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంపై వినతిపత్రం ఇచ్చారు. హైదరాబాదులోని జలసౌధ కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి, జీవో 69 ద్వారా మంజూరు చేసిన నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఉమ్మడి రాష్ట్రంలో అన్ని అనుమతులు పొందిందని, ఎంతో తక్కువ ఖర్చుతో నికర జలాలను ఇవ్వగలిగిన ఈ ప్రాజెక్టును తొక్కిపెట్టి మీరు సాధించిందేమిటి? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో మీరు వేసిన కేసులోనూ ఈ ప్రాజెక్టు వివరాలు పొందుపరచకపోవడం మీ దుర్మార్గానికి పరాకాష్ఠ అంటూ మండిపడ్డారు. అంతేకాదు, ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి రాదని, పొరుగు రాష్ట్రాలేవీ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని రేవంత్ స్పష్టం చేశారు.