Skip to main content

వేలాది 'మంచు గుడ్లు'.. అబ్బుర పరుస్తోన్న ఫొటోలు

 
సాగర తీరాన నడుచుకుంటూ వెళ్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంటే మన మనసు గాలిలో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి చాలా మంది సాగర తీరానికి చేరుకుంటారు. ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం కోసం బీచ్ కు వెళ్లిన ఫిన్లాండ్ వాసులు ఇటీవల అపురూప దృశ్యాలను చూశారు.
     కోడి గుడ్ల లాంటి మంచు ముక్కలతో వారు ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ రిస్టో మాటిలా కూడా ఈ అందమైన దృశ్యాలను కెమెరాలో బంధించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వీటికి 'మంచు గుడ్లు' అని పేరు పెట్టారు.
       సముద్ర తీరంలో చోటు చేసుకున్న వాతావరణ మార్పుల కారణంగా భారీ పరిమాణంలోని మంచు పలకకు ఇలా విడిపోయి చిన్న చిన్న ముక్కలైపోయాయి. అవి గుండ్రంగా మారి కోడి గుడ్లు, టెన్నిస్ బంతులు, ఫుట్ బాల్స్ పరిమాణంలో కనపడ్డాయి.

 ఇటువంటి అద్భుతమైన దృశ్యాలను తాము ఎన్నడూ చూడలేదని పర్యాటకులు మీడియాకు తెలిపారు. ఉష్ణోగ్రత భారీగా పడిపోయి సముద్ర ఒడ్డున ఈ ఆకారాల్లో మంచు ముక్కలు రూపుదిద్దుకున్నాయని చెప్పారు. ఫిన్లాండ్, స్వీడన్ మధ్య ఉన్న ఓ ద్వీపంలో ఈ బీచ్ ఉంటుంది. గతంలోనూ పలు దేశాల్లోని బీచుల్లో ఇటువంటి దృశ్యాలు అరుదుగా కనపడ్డాయి

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...