Skip to main content

ఉద్యోగం కోసం ‘నారాయణ’ వద్దకు వెళ్లా...ఆయనపైనే గెలిచి మంత్రినయ్యా : డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్‌

 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తన రాజకీయ ప్రస్థానంపై ఆసక్తికర విషయాలు తెలిపారు. వృత్తిరీత్యా వైద్యుడినైన తాను రాజకీయాల్లోకి వస్తానని ఏ రోజూ అనుకోలేదని, కానీ అనుకోని ఘటనలు ఎదురు కావడంతో నా జీవితంలో అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఓ చానెల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ ఒకప్పుడు నారాయణ కళాశాలలో ఉద్యోగం కోసం వెళ్లానని, అదే కళాశాల యజమాని నారాయణపై గెలిచి మంత్రిని కావడం యాధృశ్చికమన్నారు.

‘డాక్టర్‌ కోర్సు చదివాను. కానీ ఎప్పుడూ ప్రాక్టీస్‌ చేయలేదు. మా నాన్నగారు చనిపోవడంతో డెంటిస్ట్‌గా వెళ్లేందుకు మనసు అంగీకరించ లేదు. దీంతో ఓ కూల్‌ డ్రింక్‌ షాపులో ఎప్పుడూ కూర్చుని కాలక్షేపం చేసేవాడిని’ అని మంత్రి తెలిపారు. నా పరిస్థితిని చూసిన మా అమ్మ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తున్నారని అడిగితే ‘డాక్టర్‌ చదివాడు, ఖాళీగా తిరుగుతున్నాడు’ అని  చెప్పేదన్నారు.

దీంతో నారాయణ కళాశాలలో ఉద్యోగం కోసం వెళ్లానని చెప్పారు. అయితే వారు మూడు నెలలు ఆగి వస్తే చెబుతామనడంతో అక్కడ చేరే అవకాశం రాలేదన్నారు. ఈలోగా మా బాబాయి చనిపోవడం, అనుకోకుండా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని చెప్పారు. అదే నారాయణపై పోటీ చేసి గెలిచానని తెలిపారు. ఒకవేళ నారాయణ ఉద్యోగం ఇచ్చివుంటే నా పరిస్థితి వేరుగా ఉండేదేమోనని అన్నారు.  

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...